PM Modi: ట్యాక్స్లతో చిన్న పిల్లలను వదలని కాంగ్రెస్.. జీఎస్టీ సవరణలపై మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: జీఎస్టీ సంస్కరణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఎక్కువ పన్నులు విధించారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ట్యాక్స్లతో చిన్న పిల్లల టోపీలను కూడా వదలలేదని అన్నారు. గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, దేశ ప్రజల దుర్భర జీవితాలకు కాంగ్రెస్సే కారణం అని అన్నారు. జీఎస్టీ శ్లాబుల సవరణలతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక మైలురాయి అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, నిత్యావసరాల ధరలు తగ్గుతాయని తెలిపారు. సమయాన్ని బట్టి సంస్కరణలు అవసరమని ప్రధాని చెప్పారు.
READ ALSO: Prakasham: తురకపాలెంలో ముప్పై మంది చనిపోవడం బాధాకరం- మాజీ మంత్రి అంబటి రాంబాబు
Also Read
- West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
“GST అనేది స్వతంత్ర భారతదేశంలోని అతిపెద్ద ఆర్థిక సంస్కరణలలో ఒకటి… వాస్తవానికి, ఈ సంస్కరణలు దేశానికి మద్దతు, వృద్ధికి రెట్టింపునకు తోడ్పాటును అందిస్తాయి. ఒక వైపు దేశంలోని సామాన్య ప్రజలు డబ్బు ఆదా చేస్తారు.. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎనిమిది ఏళ్ల క్రితం GST అమలు ప్రారంభించినప్పుడు, అనేక దశాబ్దాల కల నిజమైంది. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చర్చ ప్రారంభం కాలేదు. గతంలో కూడా ఈ చర్చలు జరిగేవి, కానీ ఎప్పుడూ ముందుకు కదల లేదు. ఇప్పుడు GST మరింత సరళంగా మారింది… సెప్టెంబర్ 22న, అంటే నవరాత్రి మొదటి రోజు సంస్కరణలు చేసిన జీఎస్టీ అమలు కానుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ కచ్చితంగా ‘మాతృశక్తి’ దీవెనలతో చేసినవే. సకాలంలో మార్పులు లేకుండా, నేటి ప్రపంచ పరిస్థితిలో మన దేశానికి సరైన స్థానాన్ని ఇవ్వలేము. భారతదేశాన్ని స్వావలంబన చేయడానికి తదుపరి తరం సంస్కరణలను చేపట్టడం చాలా కీలకమని నేను ఈసారి ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చెప్పాను. ఈ దీపావళి, ఛత్ పూజకు ముందు దేశ ప్రజలకు రెట్టింపు ఆనందం కలుగుతుందని నేను వాగ్దానం చేశాను” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
READ ALSO: NTR – Modi : మోదీ తర్వాత రెండో స్థానంలో జూ.ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ !
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..