AP News: కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం సీఎం సమక్షంలో 6 ఎంఓయూలు!
- కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం 6 ఎంఓయూలు
- సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు
- సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్-ఐటీసీతో ఒప్పందం
- ఫైబర్ బోర్డు ఉత్పత్తి కోసం కింగ్స్ వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్తో ఎంఓయూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 ఎంఓయూలు కుదిరాయి. కుప్పం పరిధిలో వ్యర్ధాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్-ఐటీసీతో ఒప్పందం కుదిరింది. వ్యర్ధాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందంజరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో 10వేల మంది మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయటంతో పాటు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ చేసుకుంది.
కుప్పంలో ఫైబర్ బోర్డు ఉత్పత్తి కోసం కింగ్స్ వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్తో ఎంఓయూ కుదిరింది. రూ.1,100 కోట్ల పెట్టుబడితో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డును కింగ్స్ వుడ్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో 2012 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కుప్పంలో 2 సీటర్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్ ఒప్పందం చేసింది. రూ.150 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 70 నుంచి 100 శిక్షణకు ఉపయోగించే 2 సీటర్ విమానాలను తయారు చేయనుంది. మొత్తం 250 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.
Also Read
Also Read: Kieron Pollard: కీరన్ పొలార్డ్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా రికార్డు!
బెంగుళురుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ఎత్రెయాల్ ఎక్ప్ ప్లోరేషన్ గిల్డ్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదిరింది. మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ రేజర్ క్రెస్ట్ ఎంకె-1 తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎత్రెయాల్ ఒప్పందం చేసుకుంది. రూ.500 కోట్ల పెట్టుబడిని మూడు దశల్లో పెట్టేలా కార్యాచరణ, మొత్తం 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ తో ఎంఓయూ కుదిరింది. రూ.300 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి ఉపాధి కల్పించేలా ప్రతిపాదన సమర్పించింది. మామిడి, జామ, టమాటో పల్పింగ్ యూనిట్లను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది.
తాజావార్తలు
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!