Delhi: ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా వర్గాలకు తాయిలాలు ప్రకటించింది. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే సోలార్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
అలాగే అన్నదాతలకు కూడా శుభవార్త తెలిపింది. ఎరువుల రాయితీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 ఖరీఫ్ సీజన్లో ఎరువుల రాయితీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐదు రకాల ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీకి ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎరువుల రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
Also Read
కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో ఆయా కుటుంబాలకు సహాయంగా ఉంటుందని తెలిపారు. ఈ పథకం కింద నివాస పైకప్పు సౌర సంస్థాపనలకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. మిగులు విద్యుత్ను డిస్కమ్లకు విక్రయించడం ద్వారా గృహాలు తమ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చని, అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. 3 KW వ్యవస్థ ఒక గృహానికి సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలదని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
-
Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
-
Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్లు రద్దు!
-
Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!