Modi 3.0 : మోడీ క్యాబినెట్లో అత్యంత సంపన్న ఎంపీ.. ఆయన ఆస్తులు రూ.5700కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi3.0 Latest upadates: ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కనీసం 30 మంది ఎంపీలు కూడా మంత్రులగా ప్రమాణం చేస్తారని భావిస్తున్నారు. అమిత్ షా, రాజ్నాథ్, నితిన్ గడ్కరీ మినహా టీడీపీ-జేడీయూ నుంచి ఇద్దరు ఎంపీలు కొత్త మోడీ ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు. జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు ప్రముఖుల పేర్లు మంత్రుల జాబితాలో ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో బీజేపీ ఆధిపత్యం చెలాయించే అవకాశాలు బలంగా ఉన్నాయని, అంటే పూర్తి మెజారిటీ లేకపోయినప్పటికీ, మంత్రుల్లో ఎక్కువ మంది బీజేపీ వారే కావడం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేబినెట్ ప్రకటనతో ఈ సస్పెన్స్కు తెరపడనుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడైన ఎంపీ మోడీ 3.0 కేబినెట్లో చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆస్తులు రూ.5700 కోట్లకు పైగా ఉన్నాయి.
Read Also:Modi 3.0 : మళ్లీ మోడీ కొత్త క్యాబినెట్లోకి పాత ప్రభుత్వంలోని 20మంది మంత్రులు
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
తెలుగుదేశం పార్టీ తరుపున కొత్తగా ఎన్నికైన ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసాని గురించి మాట్లాడుకుంటున్నాం. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన అత్యంత ధనిక ఎంపీ పెమ్మసాని. కొత్త మోడీ ప్రభుత్వంలో పెమ్మసాని మంత్రిగా స్థానం పొందినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతం నుంచి ఎన్నికల్లో విజయం సాధించి పెమ్మసాని పార్లమెంటుకు చేరుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీకి చెందిన కిలారి వెంకట రోశయ్యపై 3.4 లక్షల ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ నేత జయదేవ్ గల్లా ప్రకారం.. మోడీ 3.0 కేబినెట్లో పెమ్మసాని రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు మరో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చని గల్లా చెబుతున్నారు.
Read Also:Camel on Car: ఇదేందయ్యా ఇది.. కారుపై ఒంటె ఇలా ఐపోయింది..
టీడీపీ ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసాని ఎవరు?
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించిన చంద్రశేఖర్ పెమ్మసాని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ-సినాయ్ హాస్పిటల్లో ఐదేళ్లపాటు వైద్యుడిగా కూడా పనిచేశాడు. 48 ఏళ్ల పెమ్మసాని Uworld వ్యవస్థాపకుడు, CEO కూడా. దీంతో పాటు టీడీపీ ఎన్నారై సెల్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. పెమ్మసాని 2020లో యుఎస్లో యువ పారిశ్రామికవేత్తగా ఎర్నెస్ట్ & యంగ్ అవార్డును గెలుచుకున్నారు. పెమ్మసాని ఫౌండేషన్ని కూడా స్థాపించాడు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన జయదేవ్ గల్లా స్థానంలో ఆయన గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8,360 మంది అభ్యర్థుల్లో పెమ్మసాని అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!