No Phones : ఉపాధ్యాయులపై విద్యాశాఖ కఠిన నిర్ణయం
- తరగతి గదుల్లో మొబైల్ వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు
- ఇంటింటికీ వెళ్లి అడ్మిషన్ల కోసం ప్రచారం
- ఉపాధ్యాయ సంఘాల్లో మొబైల్ నిషేధంపై విభిన్న అభిప్రాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Phones : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రూరల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొన్ని సందర్భాల్లో టీచర్లు తరగతులు నిర్వహించకుండా ఫోన్లలో మునిగిపోయారని స్థానిక ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు డీఈఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితులు పాఠశాలలపై నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉండటంతో, అడ్మిషన్లపై దుష్ప్రభావం పడే అవకాశాన్ని విద్యాశాఖ ఆందోళనగా చూస్తోంది.
Ram Charan : రామ్ చరణ్ కి అరుదైన గౌరవం.. లండన్ బయలుదేరిన మెగా ఫ్యామిలీ!
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
ఇందులో భాగంగా, హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో ఇటీవల ముగిసిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డీఈఓలకు పలు సూచనలు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతుల్లో మొబైల్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. అంతేకాదు, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు అతిక్రమించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
జూన్ 1 నుంచి 11 వరకు ఉపాధ్యాయులు తమ పాఠశాల పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలను, వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలలో చేర్చించేందుకు ప్రోత్సహించాలి. ఐదు ఏళ్లు నిండిన పిల్లలను బడిబాట పట్టించేలా చేసేందుకు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. అయితే, ఈ ప్రచారం క్రియాశీలంగా సాగకపోవడం కూడా అడ్మిషన్ల తగ్గుదలకు ప్రధాన కారణంగా మారిందని కొంతమంది మాజీ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తరగతుల్లో ఫోన్ నిషేధంపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు, అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ అవసరం అని చెబుతుండగా, మరికొందరు విద్యాశాఖ తీసుకున్న ఈ చర్యను సమర్థిస్తున్నారు.
Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్న్యూస్.. ఛార్జీలు పెంపు..
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?