Kishan Reddy: గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MMTS from Hyderabad to Yadadri: వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ముందుగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. అనంతరం కిషన్రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ జాతీయ రహదారులకు కృషి చేశామన్నారు. కేంద్రం ఇటీవల రాష్ట్రానికి రైల్వే తయారీ యూనిట్ను కేటాయించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంటీఎస్ కూడా కేటాయించామని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ రహదారులు బాగుపడ్డాయన్నారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోడీ ప్రధాని కాకముందు తెలంగాణకు 2,500 కి.మీ ఉంటే ఇప్పుడు 5 వేల కి.మీలకు చేరుకుందన్నారు. 150 ఎకరాల్లో రైలు తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 7 వ్యాగన్ల ఉత్పత్తి సామర్థ్యానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ. 500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
Read also: CM Jagan : మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు
Also Read
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
తెలంగాణలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా సుమారు కోటి మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా. యాదాద్రి దేవాలయం హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉంది. యాదాద్రికి నగరం నుంచి రోజుకు 10 వేల మంది భక్తులు వస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అయితే భక్తులు అక్కడికి వెళ్లేందుకు రవాణా పరంగా ఇబ్బందులు పడుతున్నారు. టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో నగరం నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు నడిపితే బాగుంటుందని భక్తులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ ఘట్కేసర్ వరకు ఉంది. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు 21 కిలోమీటర్ల మార్గంలో ఎంఎంటీఎస్ రెండో దశ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. ఘట్కేసర్ నుంచి యాదాద్రికి మరో 32 కి.మీ. రెండో దశ రహదారిని పొడిగిస్తే యాదాద్రి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఈ రైలు మార్గానికి రూ.330 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. కేంద్రం తన వాటాగా రూ.110 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం రెండు షేర్ల కింద రూ.220 కోట్లు భరించేందుకు అంగీకరించింది.
తాజావార్తలు
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!