Site icon NTV Telugu

Yanamala Ramakrishnudu: సీఎం జగన్ పై యనమల తీవ్ర విమర్శలు

Yanamala

Yanamala

సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీలో శాసనమండలిలో విపక్షనేత యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలేస్తాడని నేరగాళ్లే అనడం విడ్డూరం.దొంగే.. ‘‘దొంగ దొంగ’’ అన్నట్లుగా ఉంది జగన్ నైజం. రాష్ట్రంలో అసలు నేరగాడెవడు..? 13 ఛార్జిషీట్లున్న వ్యక్తి నేరగాడా, ఏ ఛార్జిషీట్ లేనోడు నేరగాడా..? రూ 43 వేల కోట్లు దోచేశాడని సిబీఐ చెప్పినోడు నేరగాడా, ఏ మరకా అంటని 14ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నేరగాడా..?వ్యవస్థలను నిర్మించినోడు నేరగాడా, ధ్వంసం చేసినోడు నేరగాడా..?ఉపాధి కల్పించినోడు నేరగాడా, ఉపాధి పోగొట్టినోడు నేరగాడా…? అందుక్కాదా మీకు దేవుడన్ని మొట్టికాయలేసింది.16నెలలు 16 మొట్టి కాయలు పడిందెవరికి..?

Read Also: Chittoor Crime: బెదిరించాలని అనుకున్నాడు.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు..

నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో తెలుగుదేశం ఎందరినో ఎదుర్కొంది.ఇందిరాగాంధీలాంటి ఉక్కు మనిషినే ఎదుర్కొంది.. ఆమె ముందు జగనెంత, ఓ పిపీలకం కాదా..?ఏపిలో జగన్ ఒంటరి ఎందుకయ్యారు..? ఇన్ని కేసులు, ఎన్నో నేరాలు – ఘోరాలున్నాయి కాబట్టే జగనుకు అందరూ దూరం.రాకాసి బల్లి, రాబందు వంటి అంతరిస్తున్న జాతుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకడు అని తీవ్రంగా విమర్శించారు యనమల రామకృష్ణుడు.

Read Also: Pakisthan : నన్ను కోర్టులో చంపేయొచ్చు.. చీఫ్ జస్టిస్ కు ఇమ్రాన్ లేఖ

Exit mobile version