Beeda Ravichandra: కేసులకు భయపడే కాకాణి పరారయ్యారు!
- అక్రమాలు చేయనప్పుడు కాకాణి ఎందుకు పరారయ్యారు
- బయటకు వచ్చి తాను నిజాయితీ పరుడునని చెప్పుకోవచ్చు కదా?
- హిజ్రాలతో దాడి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ దోపిడీలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పాత్ర గురించి అందరికీ తెలుసు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విమర్శించారు. అక్రమాలు చేయనప్పుడు ఎందుకు పరారయ్యారని, బయటకు వచ్చి తాను నిజాయితీ పరుడునని చెప్పుకోవచ్చు కదా? అని అన్నారు. కేసులకు భయపడే కాకాణి పరారయ్యారని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నాడని ఎమ్మెల్సీ బీదా తెలిపారు.
‘మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇప్పటి వరకూ ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చి మాజీ మంత్రి కాకాణి పైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మాట్లాడుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ దోపిడీ అందులో కాకాణి పాత్ర గురించి అందరికీ తెలుసు. అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా సోమిరెడ్డి నిరసన దీక్ష చేపడితే ఆయనపై హిజ్రాలతో దాడి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. రుస్తుం మైన్స్ లో కాకాణి అక్రమ తవ్వకాలు చేయించారు. అక్రమాలు చేయనప్పుడు ఎందుకు పరారయ్యారు. బయటకు వచ్చి తాను నిజాయితీపరుడునని చెప్పుకోవచ్చు కదా. కేసులకు భయపడే కాకాణి పరారయ్యారు’ అని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: IPL 2025: లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీకి మరో షాక్ తప్పదా?
‘ఎంపీ వేమిరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయనకు అధికారికంగా మైన్స్ ఉన్నాయి. గూడూరు సైదాపురం ప్రాంతాల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కూడా అక్రమ మైనింగ్ జరిగింది. అక్రమ మైనింగ్ కేసులో తొందరలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్ట్ కాబోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇప్పుడు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై మీద విమర్శలు చేస్తున్నారు’ అని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!