Maharastra: బైక్ను ఢీకొట్టిన ఎమ్మెల్యే మేనల్లుడు.. బైకిస్ట్ మృతి
- శనివారం పూణె-నాసిక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
- బైక్ను ఢీకొట్టిన ఎమ్మెల్యే మేనల్లుడు.. బైకిస్ట్ మృతి
- నిందితుడు మయూర్ మోహిత అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం పూణె-నాసిక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే మేనల్లుడు ప్రయాణిస్తున్న కారు రాత్రి ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మయూర్ మోహితను అరెస్ట్ చేశారు. పూణే జిల్లాలోని ఖేడ్ అలండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడు మయూర్. దిలీప్ మోహితే పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. కాగా.. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఓం భలేరావుగా గుర్తించారు.
Read Also: America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. ఏపీ యువకుడు మృతి
Also Read
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
నిందితుడు మయూర్ మోహితే నడుపుతున్న టయోటా ఫార్చ్యూనర్ ఎస్యూవీ రాంగ్ రూట్లో వచ్చి బైక్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే దిలీప్ మోహితే మీడియాతో మాట్లాడుతూ.. తన మేనల్లుడు సంఘటన స్థలం నుండి పారిపోలేదని చెప్పారు. అంతేకాకుండా..తాను మద్యం తాగి డ్రైవిండ్ చేయలేదన్నారు. ఈ ప్రమాదం అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే జరిగిందని తెలుస్తోంది. గత నెలలో నిర్లక్షపు డ్రైవింగ్తో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరణించారు. వేగంగా వచ్చిన పోర్షే వాహనం.. వారి బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. కారును నడిపింది రియల్ ఎస్టేట్ ఏజెంట్ 17 ఏళ్ల కుమారుడు.
Read Also: Diarrhea Cases: కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం.. ఇప్పటివరకు ఇద్దరు మృతి
మద్యం తాగి వాహనం నడిపిన నిందితుడు.. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే బెయిల్పై విడుదలయ్యాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఆ తర్వాత ఈ ఘటనలో అనేక విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రమాదంలో పోలీసులు చాలా మందిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!