MLA Sunke Ravi Shankar : అబద్ధాలు ఆడటం బండి సంజయ్ మానుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండి సంజయ్ నువ్వు రైతుల పరామర్శకు వెళ్ళినవా ముఖ్యమంత్రి కేసీఆర్ని తిట్టడానికి వెళ్ళినవా అని ప్రశ్నించారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఇవాళ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ. చేతకాని దద్దమ్మ బండి సంజయ్ అని నిప్పులు చెరిగారు. గత నెలలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శించని దద్దమ్మ బండి సంజయ్ అని ఆయన మండిపడ్డారు. గతంలో వర్షాలకు నష్టపోయిన నివేదికలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Viral Video: చీర కోసం జుట్లుపట్టుకుని కొట్టుకున్న లేడీస్.. డిస్కౌంట్ సేల్లో ఘటన
Also Read
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
- స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
- Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
అబద్ధాలు ఆడటం బండి సంజయ్ మానుకోవాలని ఆయన హితవు పలికారు. బండి సంజయ్ దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం తరఫున తక్షణమే 1000 కోట్ల సహాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లాలో 9500 మంది రైతులకు 8కోట్ల 16లక్షల రూపాయల నష్టపరిహారం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, చొప్పదండి నియోజకవర్గంలో గత వడగండ్ల వానలకు నష్టపోయిన 4000 మంది రైతులు 3500 ఎకరాలకు 3 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఎకరానికి 20000 తీసుకురా అని ఆయన సవాల్ విసిరారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలే లేవని, దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతుల కోసం నిర్మించిన రైతు కల్లాల నిధులను 150 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వాపస్ తీసుకుంది.దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. గత నెలలో వడగండ్ల వర్షాల సమయంలో పంటలు ఇంకా కోతకు కూడా రాలేదని, కానీ బండి సంజయ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదనడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.
Also Read : Upasana: మెగా కోడలి సీమంతం చేసిన ఆడపడుచులు.. భలే ఉన్నారే
ఎరువులు,విత్తనాల ధరలు పెంచింది బిజెపి కేంద్ర ప్రభుత్వమని, రైతులు దేశ రాజధాని ఢిల్లీలో మద్దతు ధరల గురించి ధర్నా చేస్తే లాఠీ ఛార్జ్, బాష్పవాయువు గోలాలతో,రబ్బరు బుల్లెట్లతో చంపించిన ఘణుడు మోడీ అని ఆయన అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. వడగండ్ల వాన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!