MLA Revuri: జయశంకర్ సార్ స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వస్థలమైన అక్కంపేట గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా ప్రకటించింది. ఈ క్రమంలో.. జీవో జారీ చేయడంతో అక్కంపేట గ్రామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. ప్రొఫెసర్ జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తూ ఇచ్చిన జీవో కాపీని గ్రామస్తులకు అందజేశారు.
Chiranjeevi: కేసీఆర్ కు గాయం.. చాలా భాదపడ్డాను
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రచ్చబండ కార్యక్రమంలో అక్కంపేట గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతంగా ఉండడం చూసి తాము అధికారంలోకి రాగానే అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారన్నారు. ఇటీవల పరకాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తాను కూడా అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలని కోరానని చెప్పారు. రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించగానే తాను అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలని సీఎంకి గుర్తు చేయడం జరిగిందని సీఎంగా తెలిపారు.
Big Breaking: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు లైన్ క్లియర్
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి జీవో జారీ చేయడం జరిగిందని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పరకాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని.. ప్రొఫెసర్ జయశంకర్ ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు.
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!