MLA Rajasingh: ఏ వేదికపై ఏం మాట్లాడాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశాడు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ తమాషాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైందని రాజాసింగ్ ఆరోపించారు. అర్హులను కాదని, అనర్హులు, బీఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తున్నారని ఆయన అన్నారు. గోషామహాల్ నియోజకవర్గంలో అర్హత లేని అనేక మందికి ఇళ్ళు ఇచ్చారు.. డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిందని రాజాసింగ్ ఆరోపించారు. కానీ, తామే నిర్మించినట్లు బీఆర్ఎస్ చెబుతోందన్నారు.. ఇక కేసీఆర్ హయాంలో రాష్ట్రం మత్తుల తెలంగాణగా మారిందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎద్దేవా చేశాడు.
Also Read
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
కొల్లురులో డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ కార్యక్రమం వేదికను బహిష్కరించాను అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యనించారు. ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదు.. బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. 2BHK ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో మోడీని, బీజేపీ ను టార్గెట్ చేస్తున్నారు.. అందుకే నేను వేదికపై నుంచి వచ్చేశాను అంటూ రాజాసింగ్ తెలిపారు.
Read Also: Tirumala Brahmotsavams: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
కాగా, GHMC పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11,700 మంది లబ్దిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. లబ్దిదారులను ఆన్లైన్ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని చెప్పింది.. అయితే రాజాసింగ్ మాత్రం దీన్ని తప్పు పట్టారు.. బీజేపీ నుంచి బహిష్కరించబడిన నేతగా రాజాసింగ్ ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా నిలిచిపోయాడు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాను ఇకపై అసెంబ్లీలో అడుగుపెడతానో లేదో అనే కామెంట్స్ చేశాడు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై బీఆర్ఎస్ సర్కారు తీరును విమర్శించడంతో ఆయన బీజేపీ, బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. ఇక స్వతంత్ర అభ్యర్దిగా ఎన్నికల బరిలో నిలుస్తారని అందరూ అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!