MLA Rajasingh: ఏ వేదికపై ఏం మాట్లాడాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశాడు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ తమాషాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైందని రాజాసింగ్ ఆరోపించారు. అర్హులను కాదని, అనర్హులు, బీఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తున్నారని ఆయన అన్నారు. గోషామహాల్ నియోజకవర్గంలో అర్హత లేని అనేక మందికి ఇళ్ళు ఇచ్చారు.. డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిందని రాజాసింగ్ ఆరోపించారు. కానీ, తామే నిర్మించినట్లు బీఆర్ఎస్ చెబుతోందన్నారు.. ఇక కేసీఆర్ హయాంలో రాష్ట్రం మత్తుల తెలంగాణగా మారిందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎద్దేవా చేశాడు.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
కొల్లురులో డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ కార్యక్రమం వేదికను బహిష్కరించాను అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యనించారు. ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదు.. బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. 2BHK ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో మోడీని, బీజేపీ ను టార్గెట్ చేస్తున్నారు.. అందుకే నేను వేదికపై నుంచి వచ్చేశాను అంటూ రాజాసింగ్ తెలిపారు.
Read Also: Tirumala Brahmotsavams: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
కాగా, GHMC పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11,700 మంది లబ్దిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. లబ్దిదారులను ఆన్లైన్ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని చెప్పింది.. అయితే రాజాసింగ్ మాత్రం దీన్ని తప్పు పట్టారు.. బీజేపీ నుంచి బహిష్కరించబడిన నేతగా రాజాసింగ్ ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా నిలిచిపోయాడు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాను ఇకపై అసెంబ్లీలో అడుగుపెడతానో లేదో అనే కామెంట్స్ చేశాడు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై బీఆర్ఎస్ సర్కారు తీరును విమర్శించడంతో ఆయన బీజేపీ, బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. ఇక స్వతంత్ర అభ్యర్దిగా ఎన్నికల బరిలో నిలుస్తారని అందరూ అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!