MLA Rajasingh: ఏ వేదికపై ఏం మాట్లాడాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు
బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశాడు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ తమాషాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైందని రాజాసింగ్ ఆరోపించారు. అర్హులను కాదని, అనర్హులు, బీఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తున్నారని ఆయన అన్నారు. గోషామహాల్ నియోజకవర్గంలో అర్హత లేని అనేక మందికి ఇళ్ళు ఇచ్చారు.. డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిందని రాజాసింగ్ ఆరోపించారు. కానీ, తామే నిర్మించినట్లు బీఆర్ఎస్ చెబుతోందన్నారు.. ఇక కేసీఆర్ హయాంలో రాష్ట్రం మత్తుల తెలంగాణగా మారిందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎద్దేవా చేశాడు.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
కొల్లురులో డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ కార్యక్రమం వేదికను బహిష్కరించాను అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యనించారు. ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదు.. బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. 2BHK ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో మోడీని, బీజేపీ ను టార్గెట్ చేస్తున్నారు.. అందుకే నేను వేదికపై నుంచి వచ్చేశాను అంటూ రాజాసింగ్ తెలిపారు.
Read Also: Tirumala Brahmotsavams: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
కాగా, GHMC పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11,700 మంది లబ్దిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. లబ్దిదారులను ఆన్లైన్ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని చెప్పింది.. అయితే రాజాసింగ్ మాత్రం దీన్ని తప్పు పట్టారు.. బీజేపీ నుంచి బహిష్కరించబడిన నేతగా రాజాసింగ్ ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా నిలిచిపోయాడు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాను ఇకపై అసెంబ్లీలో అడుగుపెడతానో లేదో అనే కామెంట్స్ చేశాడు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై బీఆర్ఎస్ సర్కారు తీరును విమర్శించడంతో ఆయన బీజేపీ, బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. ఇక స్వతంత్ర అభ్యర్దిగా ఎన్నికల బరిలో నిలుస్తారని అందరూ అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!