Kunamneni Sambasiva Rao: బీజేపీ త్రాచుపాము లాంటిది.. తలలోనే కాదు తోకలోనూ విషం ఉంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Kunamneni Sambasiva Rao on PM Modi: బీజేపీ త్రాచుపాము లాంటిదని, తలలోనే కాదు తోకలోనూ ఆ పార్టీకి విషం ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి అధికార పిచ్చి పట్టిందని, అధికారం కోసం దేశాన్ని కండఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ప్రచారం చేయకుండా.. హిందూ, ముస్లింలను రెచ్చగొట్టే ప్రచారం చేశారని మండిపడ్డారు. మోడీకి ఎన్నికల కమిషన్ అన్న కూడా లెక్కలేకుండా పోయిందన్నారు. దేశంలో బీజేపీ పేరు మీద కాకుండా.. మోడీ మేనిఫెస్టో, మోడీ గ్యారెంటీ అంటూ ప్రచారం చేశారని కూనంనేని ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… ‘పదేళ్ల కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు. చేసింది ఏమీ చెప్పలేక ముస్లిం రిజర్వేషన్ల సాకుతో ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుంది. రాజ్యాంగాన్ని మార్చమని మోడీ అంటుంటే.. ఆయన శిష్యులు మాత్రం మారుస్తామంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చమంటూనే.. ముస్లిం రిజర్వేషన్లు మారుస్తామని మోడీ చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి?. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ప్రచారం చేయకుండా.. హిందూ-ముస్లింలను రెచ్చగొట్టేలా ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికల కమిషన్ అన్న కూడా లెక్కలేకుండా పోయింది. దేశంలో శ్రీరామనవమి కంటే ముందే రాముని అక్షంతలను పంపిణీ చేశారు’ అని అన్నారు.
Also Read
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
Also Read: Boora Narsaiah Goud: 75 శాతం బీసీలను మమతా బెనర్జీ వెన్నుపోటు పొడిచారు!
‘దేశంలో బీజేపీ పేరు మీద కాకుండా.. మోడీ మేనిఫెస్టో, మోడీ గ్యారెంటీ అంటూ ప్రచారం చేశారు. నరేంద్ర మోడీకి పదవీకాంక్ష పీక్ స్టేజ్కు పోయింది, అందుకే 2047లో కూడా నేనే ప్రధానిని అంటున్నారు. మోడీకి అధికార పిచ్చి పట్టింది. అధికారం కోసం దేశాన్ని కండఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. దేశంలో బీజేపీ త్రాచుపాము లాంటిది.. దానికి తలలోనే కాదు తోకలోను విషం ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి. నిధులు లేక అన్ని శాఖల్లో బకాయిలు పేరుకపోతున్నాయి. కేసీఆర్ కుర్చీ దిగిపోయి అదృష్టవంతుడయ్యారు. ఆయన పాపాలు ఇప్పటి ప్రభుత్వం మోస్తుంది. కొత్త ప్రభుత్వం ఆర్థిక సంక్షేమం నుంచి బయట పడాలంటే.. అఖిలపక్షం మేధావుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. వరికి 500 బోనస్.. సన్న బియ్యంకే కాదు అన్ని బియ్యాలకు ఇవ్వాలి’ అని కూనంనేని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
-
Shwetha Menon: మలయాళ ‘అమ్మ’లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
-
Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
-
JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
-
Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!