Daggupati Prasad: దళారుల మాటలు నమ్మొద్దు.. 24 గంటలు అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా రావొచ్చు..
- అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దళారీల మాట ఎవరు నమ్మవద్దని.. మీకు పదవులు లేదా ఇతర పనులు చేయిస్తామని డబ్బులు అడిగితే ఇవ్వద్దని సూచించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
- మీకు ఏ పని కావాలన్నా 24x7 నేను అందుబాటులో ఉంటాను.. ఎప్పుడైనా మీరు రావచ్చని తెలిపారు దగ్గుపాటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggupati Prasad: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దళారీల మాట ఎవరు నమ్మవద్దని.. మీకు పదవులు లేదా ఇతర పనులు చేయిస్తామని డబ్బులు అడిగితే ఇవ్వద్దని సూచించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. మీకు ఏ పని కావాలన్నా 24×7 నేను అందుబాటులో ఉంటానని.. ఎప్పుడైనా మీరు రావచ్చని దగ్గుపాటి అన్నారు. అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్, రైల్వే స్టేషన్ సమీపంలోని అన్న క్యాంటీన్లను ఆయన పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నిత్యం పేదల ఆకలి తీర్చిన ఈ క్యాంటీన్లు మూతపడిన తీరు గురించి ఆయన ఆరా తీశారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఈ క్యాంటీన్లను వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. త్వరలోనే వీటిని తెరిచి మళ్లీ పేదలకి తక్కువ ధరకే భోజనం అందిస్తామని స్పష్టం చేశారు.
Read Also: PM Modi: ఇటలీలో మోడీ బిజిబిజీ.. అగ్ర నేతలతో సమావేశం
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ఇక, ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ.. నిన్నటి వరకు రాష్ట్రం ఒక అంధకారంలో ఉందని.. ఇప్పుడు చంద్రబాబు రూపంలో వెలుగు వచ్చిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఐదు హామీల మీద ఆయన సంతకాలు చేశారని అన్నారు. ఇప్పటి వరకు జగన్ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు. కానీ, చంద్రబాబు ఒకేరోజు 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసేలా తొలి సంతకం చేశారన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని.. అందుకే ఆ చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తూ రెండవ సంతకం చేశారన్నారు. 60 లక్షల మందికి పైగా వృద్ధులు, వికలాంగులకు మేలు చేకూర్చే విధంగా పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేశారన్నారు. పేదల ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ నాలుగో సంతకం చేశారని.. యువతలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేశారని వివరించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!