AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ గురుకులాల ప్రభంజనం.. 97 శాతం ఉత్తీర్ణత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు.. 12 ఏళ్ల రికార్డులు బ్రేక్ అయ్యాయి.. అయితే, ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ గురుకుల విద్యాసంస్థలు అద్భుత ప్రతిభ కనబరిచారు.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎంజేపీ గురుకులాలకు చెందిన విద్యార్థులు 97 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్ ఇంటర్లో 94 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.. దీనిపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి సవిత.. ఈ ఫలితాలు బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
Read Also: AP Government: అమరావతిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ‘Thi’ కాదు.. ‘Ti’ ఉండాల్సిందే..
Also Read
- Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
మంత్రి సవిత వెల్లడించిన వివరాల ప్రకారం, ఎంజేపీ గురుకులాలకు చెందిన విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్లో 97 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్ ఇంటర్లో 94 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఈ ఫలితాలు బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి సవిత అభినందనలు తెలిపారు. అలాగే ఈ విజయానికి కారణమైన గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫలితాల సాధనలో ఎంజేపీ గురుకులాల సిబ్బంది పనితీరు అమోఘమని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వల్లే బీసీ గురుకులాల అభివృద్ధికి కొత్త దిశ లభించిందని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీ గురుకులాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించిందని చెప్పారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తూ సమగ్ర విద్యను అందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీ బిడ్డలు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా కూటమి ప్రభుత్వం లక్ష్యం నెరవేరిందని ఆమె తెలిపారు. ఎంజేపీ గురుకులాల విద్యార్థులు సాధించిన ఈ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆనంద వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
-
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
-
Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
-
Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!