Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Sridhar Babu Says Aim Is To Set Up Mini Msme Industries In Rural Areas

Sridhar Babu: గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం!

Published Date :January 30, 2025 , 2:42 pm
By Sampath Kumar
  • ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ వెళ్ళాము
  • త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీల పున:ప్రారంభం
  • ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
Sridhar Babu: గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయని, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి మంత్రి ధన్యవాదాలు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి రూ.1.73 ల‌క్షల కోట్ల రూపాయిల పెట్టుబ‌డులు తీసుకొచ్చారు.

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘పరిశ్రమలు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటన చేశాం. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి ధన్యవాదాలు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గతేడాది తెలంగాణలో మొదటి సారి ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకొచ్చాం. దేశంలోని ఈ పాలసీ ప్రొడక్టివిటీ ఉన్న పాలసీగా పేరొందింది. రైతులకి ఉపయోగపడే విధంగా ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం మా లక్ష్యం. ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో దావోస్ పర్యటన విజయవంతంగా జరిగింది’ అని చెప్పారు.

Also Read

  • Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

‘షుగర్ ఫ్యాక్టరీల పున:ప్రారంభం త్వరలోనే జరుగుతాయి. 2025 డిసెంబర్ లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు చేస్తున్నాం. ఒక నెల ముందే పున:ప్రారంభం చేయాలనే ఆలోచన ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో షుగర్ ఫ్యాక్టరీలను రీ ఓపెన్ చేస్తాం. తక్కువ పెట్టుబడితో డీప్ సీక్ లాంటి ప్రాడక్ట్ తీసుకురావొచ్చు. మనదేశంలోని మేధశక్తితో డీప్ సీక్ లాంటి ప్రాడక్ట్ ప్రోత్సాహం అందిస్తాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయనని పార్టీకి చెప్పారు. అందుకే ఇతర అభ్యర్ధుల దరఖాస్తుల పరిశీలన చేశాం. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది ఖరారు అవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇండ్లు ఉన్నవాళ్లు దరఖాస్తు చేస్తే నిరాశ ఎదురవుతుంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం’ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • karimnagar
  • MSME
  • sridhar babu
  • telangana

తాజావార్తలు

  • Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే

  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..

  • Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్‌గా వదిలించే సూపర్ టిప్స్!

  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!

  • LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions