Minister Seethakka : ప్రతి మనిషికి 100 లీటర్ల నీరు.. ప్రతిరోజు అందించాల్సిందే
- గాలి తర్వాత నీరే మనుషులు కావాలి
- కోట్ల మందికి నీరందించే అదృష్టం మనకే దక్కింది
- ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే : మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : వచ్చే ఐదు నెలల కోసం మిషన్ భగీరథ సిబ్బంది ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు మంత్రి సీతక్క. వేసవి ముగిసే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. గాలి తర్వాత నీరే మనుషులు కావాలన్నారు. కోట్ల మందికి నీరందించే అదృష్టం మనకే దక్కిందని, ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో మండల స్థాయిలో క్రీమ్ కమిటీ వేసుకోండని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతోపాటు, మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టండన్నారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ పై వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలు ఎందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలన్నారు. ఎంతమంది మిషన్ భగీరథ నీరు తాగునీటి కోసం వినియోగించడం లేదో సర్వేలు చేపట్టండని ఆమె అన్నారు.
Varalaxmi: మరో తెలుగు సినిమాకి వరలక్ష్మీ గ్రీన్ సిగ్నల్?
Also Read
అంతేకాకుండా..’అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మేర మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేస్తున్నాము? ఎన్ని గృహాలకు నీరు అందటం లేదు వంటి వివరాలను ఎమ్మెల్యేలకు అందజేయండి.. మిషన్ భగీరథ నీళ్లు వాడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టండి.. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించండి… ప్రతి ప్రాణం ముఖ్యమైనది.. మిషన్ భగీరథ నీటి కారణంగా ఎవరు అనారోగ్యం పాలు కాకూడదు.. ఆ బాధ్యత మిషన్ భగీరథ ఇంజనీర్లది.. అడవులలో తిరిగినప్పుడు నేను అన్ని రకాల నీళ్లు తాగాను, అయినా నాకు ఏమి కాలేదు.. కానీ ఇప్పుడు ప్రజలు ఆర్వో ప్లాంట్లకు అలవాటై సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.. అధికారులంతా నిబద్ధతతో పని చేయాలి.. కావాలని తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తాం.. ఆదివాసీ మహిళగా నాకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది.. తెలంగాణ చరిత్రలోనే కాదు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఈ మహిళకు ఇటువంటి అవకాశం దక్కలేదు.. ప్రతి నిమిషం ప్రజాసేవ కోసం అంకితమవుతున్న.. నా పేరు మీద పెట్టేలా, శాఖకు వన్నెతెచ్చేలా అధికారులు అంతా పనిచేయాలి’ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
WhatsApp Governance: రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలు.. దేశంలోనే మొదటి సారి
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!