Minister Seethakka : ప్రతి మనిషికి 100 లీటర్ల నీరు.. ప్రతిరోజు అందించాల్సిందే
- గాలి తర్వాత నీరే మనుషులు కావాలి
- కోట్ల మందికి నీరందించే అదృష్టం మనకే దక్కింది
- ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే : మంత్రి సీతక్క
Minister Seethakka : వచ్చే ఐదు నెలల కోసం మిషన్ భగీరథ సిబ్బంది ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు మంత్రి సీతక్క. వేసవి ముగిసే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. గాలి తర్వాత నీరే మనుషులు కావాలన్నారు. కోట్ల మందికి నీరందించే అదృష్టం మనకే దక్కిందని, ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో మండల స్థాయిలో క్రీమ్ కమిటీ వేసుకోండని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతోపాటు, మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టండన్నారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ పై వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలు ఎందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలన్నారు. ఎంతమంది మిషన్ భగీరథ నీరు తాగునీటి కోసం వినియోగించడం లేదో సర్వేలు చేపట్టండని ఆమె అన్నారు.
Varalaxmi: మరో తెలుగు సినిమాకి వరలక్ష్మీ గ్రీన్ సిగ్నల్?
Also Read
అంతేకాకుండా..’అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మేర మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేస్తున్నాము? ఎన్ని గృహాలకు నీరు అందటం లేదు వంటి వివరాలను ఎమ్మెల్యేలకు అందజేయండి.. మిషన్ భగీరథ నీళ్లు వాడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టండి.. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించండి… ప్రతి ప్రాణం ముఖ్యమైనది.. మిషన్ భగీరథ నీటి కారణంగా ఎవరు అనారోగ్యం పాలు కాకూడదు.. ఆ బాధ్యత మిషన్ భగీరథ ఇంజనీర్లది.. అడవులలో తిరిగినప్పుడు నేను అన్ని రకాల నీళ్లు తాగాను, అయినా నాకు ఏమి కాలేదు.. కానీ ఇప్పుడు ప్రజలు ఆర్వో ప్లాంట్లకు అలవాటై సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.. అధికారులంతా నిబద్ధతతో పని చేయాలి.. కావాలని తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తాం.. ఆదివాసీ మహిళగా నాకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది.. తెలంగాణ చరిత్రలోనే కాదు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఈ మహిళకు ఇటువంటి అవకాశం దక్కలేదు.. ప్రతి నిమిషం ప్రజాసేవ కోసం అంకితమవుతున్న.. నా పేరు మీద పెట్టేలా, శాఖకు వన్నెతెచ్చేలా అధికారులు అంతా పనిచేయాలి’ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
WhatsApp Governance: రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలు.. దేశంలోనే మొదటి సారి
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!