NTV Telugu Site icon

DGP Daughter Marriage: డీజీపీ కుమార్తె వివాహం.. వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు

Ap Dgp

Ap Dgp

DGP Daughter Marriage: ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రి సవిత ఆశీర్వదించారు. వివాహా వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Read Also: Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..