Satyavathi Rathod : కోవర్టులుగా పని చేయడం కంటే పార్టీ వీడటమే మంచిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. అయితే.. నిన్నటితో మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించేందుకు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిన్నటికి నిన్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అవును అన్నట్లుగానే ఈ రోజు ఉదయం టీఆర్ఎస్కు బూర నర్సయ్య రాజీనామా చేశారు. అయితే.. త్వరలోనే అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్ చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్తో విభేదించి రాజకీయంగా ఎదిగిన నేతలు ఎవరూ లేరని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
Also Read : Andaman and Nicobar: ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సామూహిక అత్యాచారం.. చీఫ్ సెక్రటరీపై మహిళ ఆరోపణలు
పార్టీ మారే హక్కు ఎవరికైనా ఉందని.. పార్టీ మారాలనుకున్నప్పుడు అవకాశం ఇచ్చి రాజకీయ బిక్ష పెట్టిన పార్టీపై విమర్శలు చేయడం సరి కాదని ఆమె అన్నారు. రాజకీయంగా గుర్తింపు లేని బూర నరసయ్య గౌడ్ కు ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకున్న కేసీఆర్ రెండోసారి కూడా అవకాశం ఇచ్చారని ఆమె అన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా మరొకరికి నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వలేదని ఆమె గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని బదనాం చేయడానికే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నరని ఆమె విమర్శించారు. కోవర్టులుగా పని చేయడం కంటే పార్టీ వీడటమే మంచిదని ఆమె అన్నారు.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!