Minister Satya Prasad: తిరుపతిలో లూలు మాల్, హయత్ మాల్స్
- తిరుపతిలో లూలు మాల్, హయత్ మాల్స్
- కూటమి ప్రభుత్వం ప్రోగ్రెసివ్, ప్రో యాక్టివ్ గవర్నమెంట్ గా పనిచేస్తుంది.
- తిరుపతి టూరిజం హబ్ గా చేసేందుకు ముఖ్యమంత్రి పూర్తి సహకారం అందిస్తారు.
- పేర్కొన్న రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Prasad: అతి త్వరలో తిరుపతిలో లూలు మాల్, హయత్ మాల్స్ రానున్నట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కన్నా మిన్నగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని, తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న శెట్టిపల్లి సమీక్ష సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవతో రెవెన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులు, సిసిఎల్ఎ, జిల్లా కలెక్టర్ జెసి మున్సిపల్ కమిషనర్లతో, సమీక్ష నిర్వహించి మోడల్ టౌన్షిప్ గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే శ్రీ సిటీ నందు రెండవ దఫా భూ కేటాయింపు 2500 ఎకరాలకు కలెక్టర్, జేసి కృషి చేస్తున్నారని, పలు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా తీర్చి దిద్దుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇక ఒబెరాయ్ హోటల్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం టూరిజం ఒక పరిశ్రమగా గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రోగ్రెసివ్, ప్రో యాక్టివ్ గవర్నమెంట్ గా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే తిరుపతి నందు టిడిఆర్ బాండ్లపై చర్యలు తీసుకుంటామని, తిరుపతి జిల్లా పర్యాటక హబ్ గా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
అలాగే తిరుపతి టూరిజం హబ్ గా చేసేందుకు ముఖ్యమంత్రి పూర్తి సహకారం ఉంటుందని.. అలాగే పులికాట్ ముఖ ద్వార పూడికతీతకు 100 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో తిరుపతి జిల్లాలో 34 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులో రానున్నదని ఆయన అన్నారు.అలాగే జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు త్వరలో ఇస్తామని ఆయన అన్నారు. రానున్న వేసవికి తిరుపతి జిల్లాలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!