Minister Roja: 2024లో టీడీపీకి రెండు సీట్లు కూడా రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి ఆర్ కె రోజా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ను ఎవరు వ్యతిరేకిస్తే వారికే నష్టం, జగన్ కు కాదు. జగన్ చరిష్మాతో వీరంతా ఎమ్మెల్యేలుగా గెలిచారు. చంద్రబాబు వైస్రాయ్ రాజకీయాలను ఇప్పటికీ సిగ్గులేకుండా కొనసాగిస్తున్నారు. చంద్రబాబును తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నా అన్నారు. ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నపుడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఎమ్మెల్యేలను కొన్న వ్యక్తి చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారు.
Read Also: April 28th: అదీ… ఏప్రిల్ 28 సెంటిమెంట్!
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
అందుకే 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా రావు. క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటో త్వరలో తెలుస్తుంది. ఎమ్మెల్యే సీట్లు రాని వారు వెళ్ళారు, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినవారిపై చర్యలు తప్పవన్నారు. ఇదిలా ఉంటే నిన్న శాసనసభలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని గుర్తించాం..నలుగురి పై పార్టీలో విశ్లేషణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం..చంద్రబాబు నీచ రాజకీయాలను నమ్మి వెళ్లిన నలుగురికి రాజకీయ భవిష్యత్తు ఉండదు..మా బలంతో మేము గెలిచాము, చంద్రబాబును నమ్మి నాడు వెళ్లిన 23 మంది పరిస్థితి ఏమైంది..వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్దానాలు గెలుచుకుని తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీవీతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడారు. ప్రజలతో సంబంధం లేని ఎన్నిక ఇది. రాజకీయాలుగా మాత్రమే ఈ ఎన్నికను చూడాలి. టీడీపీ చెబుతున్నట్టు ప్రజాస్వామ్య విజయం కాదు. మాతోనే ఉండి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిపై కటిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే అధిష్టానం విప్ కి వ్యతిరేకంగా ఓటు ఎవరు వేశారో గుర్తించింది. వైసీపీ ఫెయిర్ పాలిటిక్స్ చేస్తుంది. చంద్రబాబుకి మొదటి నుంచి కుట్రలు, కుతంత్రాలు చేయటం అలవాటు అని మండిపడ్డారు.
Read Also: Post Office Scheme: రోజుకు రూ.333 పెడితే.. రూ.16లక్షలు మీవే
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?