Ponnam Prabhakar : ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకం
- సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం
- ఇందిరమ్మ ఇళ్లు మంజూరు హామీ
- ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా, కోహెడ మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న బియ్యం పథకం ప్రజల మంచి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చారిత్రాత్మక పథకంగా మారిందని, ఈ పథకం కింద, ప్రతీ పౌరుడికి కనీసం ఒకసారి సన్న బియ్యం తినేందుకు అవకాశం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నందున, అది దేశంలో ఇతర రాష్ట్రాల ప్రేరణగా మారాలని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిందని, ఉగాది పండుగ నుండి ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకమని మంత్రి పొన్నం అన్నారు. అలాగే, భోజన కార్యక్రమం పై మంత్రి మాట్లాడుతూ, “మల్లవ్వ మంచి భోజనం పెట్టింది, వారు రేకుల గుడిసె లో నివసిస్తున్నారు. వారితో ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగాను, వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం,” అని తెలిపారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఈ సన్న బియ్యం పథకాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నాలు ఎందుకు వద్దనుకుంటున్నారో ప్రశ్నించారు. “ఇది రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు, దీన్ని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలనే ఆశ ఉంది,” అన్నారు. ఆయన మరింతగా, “ఈ కార్యక్రమం ప్రత్యేకంగా తెలంగాణలోనే జరుగుతుంది. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపిస్తే, అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది,” అని వివరించారు. జమ్మూ కాశ్మీర్ ఘటనపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. “ఈ ఘటన చాలా బాధాకరం. ఇది రాజకీయాలకతీతంగా మనం ఖండించాలి,” అని అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా, కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింతగా ప్రజలకి చేరుకోవాలని, సన్న బియ్యం పథకంలోకి ప్రతీ పౌరుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!