Ponnam Prabhakar : ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకం
- సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం
- ఇందిరమ్మ ఇళ్లు మంజూరు హామీ
- ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా, కోహెడ మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న బియ్యం పథకం ప్రజల మంచి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చారిత్రాత్మక పథకంగా మారిందని, ఈ పథకం కింద, ప్రతీ పౌరుడికి కనీసం ఒకసారి సన్న బియ్యం తినేందుకు అవకాశం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నందున, అది దేశంలో ఇతర రాష్ట్రాల ప్రేరణగా మారాలని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిందని, ఉగాది పండుగ నుండి ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకమని మంత్రి పొన్నం అన్నారు. అలాగే, భోజన కార్యక్రమం పై మంత్రి మాట్లాడుతూ, “మల్లవ్వ మంచి భోజనం పెట్టింది, వారు రేకుల గుడిసె లో నివసిస్తున్నారు. వారితో ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగాను, వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం,” అని తెలిపారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఈ సన్న బియ్యం పథకాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నాలు ఎందుకు వద్దనుకుంటున్నారో ప్రశ్నించారు. “ఇది రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు, దీన్ని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలనే ఆశ ఉంది,” అన్నారు. ఆయన మరింతగా, “ఈ కార్యక్రమం ప్రత్యేకంగా తెలంగాణలోనే జరుగుతుంది. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపిస్తే, అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది,” అని వివరించారు. జమ్మూ కాశ్మీర్ ఘటనపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. “ఈ ఘటన చాలా బాధాకరం. ఇది రాజకీయాలకతీతంగా మనం ఖండించాలి,” అని అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా, కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింతగా ప్రజలకి చేరుకోవాలని, సన్న బియ్యం పథకంలోకి ప్రతీ పౌరుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..