Ponnam Prabhakar : ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకం
- సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం
- ఇందిరమ్మ ఇళ్లు మంజూరు హామీ
- ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా, కోహెడ మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న బియ్యం పథకం ప్రజల మంచి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చారిత్రాత్మక పథకంగా మారిందని, ఈ పథకం కింద, ప్రతీ పౌరుడికి కనీసం ఒకసారి సన్న బియ్యం తినేందుకు అవకాశం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నందున, అది దేశంలో ఇతర రాష్ట్రాల ప్రేరణగా మారాలని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిందని, ఉగాది పండుగ నుండి ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకమని మంత్రి పొన్నం అన్నారు. అలాగే, భోజన కార్యక్రమం పై మంత్రి మాట్లాడుతూ, “మల్లవ్వ మంచి భోజనం పెట్టింది, వారు రేకుల గుడిసె లో నివసిస్తున్నారు. వారితో ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగాను, వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం,” అని తెలిపారు.
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
ఈ సన్న బియ్యం పథకాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నాలు ఎందుకు వద్దనుకుంటున్నారో ప్రశ్నించారు. “ఇది రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు, దీన్ని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలనే ఆశ ఉంది,” అన్నారు. ఆయన మరింతగా, “ఈ కార్యక్రమం ప్రత్యేకంగా తెలంగాణలోనే జరుగుతుంది. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపిస్తే, అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది,” అని వివరించారు. జమ్మూ కాశ్మీర్ ఘటనపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. “ఈ ఘటన చాలా బాధాకరం. ఇది రాజకీయాలకతీతంగా మనం ఖండించాలి,” అని అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా, కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింతగా ప్రజలకి చేరుకోవాలని, సన్న బియ్యం పథకంలోకి ప్రతీ పౌరుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!