Ponnam Prabhakar : ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకం
- సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం
- ఇందిరమ్మ ఇళ్లు మంజూరు హామీ
- ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా, కోహెడ మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న బియ్యం పథకం ప్రజల మంచి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చారిత్రాత్మక పథకంగా మారిందని, ఈ పథకం కింద, ప్రతీ పౌరుడికి కనీసం ఒకసారి సన్న బియ్యం తినేందుకు అవకాశం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నందున, అది దేశంలో ఇతర రాష్ట్రాల ప్రేరణగా మారాలని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిందని, ఉగాది పండుగ నుండి ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకమని మంత్రి పొన్నం అన్నారు. అలాగే, భోజన కార్యక్రమం పై మంత్రి మాట్లాడుతూ, “మల్లవ్వ మంచి భోజనం పెట్టింది, వారు రేకుల గుడిసె లో నివసిస్తున్నారు. వారితో ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగాను, వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం,” అని తెలిపారు.
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
ఈ సన్న బియ్యం పథకాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నాలు ఎందుకు వద్దనుకుంటున్నారో ప్రశ్నించారు. “ఇది రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు, దీన్ని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలనే ఆశ ఉంది,” అన్నారు. ఆయన మరింతగా, “ఈ కార్యక్రమం ప్రత్యేకంగా తెలంగాణలోనే జరుగుతుంది. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపిస్తే, అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది,” అని వివరించారు. జమ్మూ కాశ్మీర్ ఘటనపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. “ఈ ఘటన చాలా బాధాకరం. ఇది రాజకీయాలకతీతంగా మనం ఖండించాలి,” అని అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా, కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింతగా ప్రజలకి చేరుకోవాలని, సన్న బియ్యం పథకంలోకి ప్రతీ పౌరుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!