NTV Telugu Site icon

Minister Rama Naidu: ఆ గొప్ప వ్యక్తి ఆలోచనతో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం..

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

Minister Rama Naidu: విజయవాడలో కేఎల్ రావు 120వ జయంతి కార్యక్రమాన్ని ఇరిగేషన్ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీలో కేఎల్ రావు జయంతిని ఘనంగా సీఎం చంద్రబాబు మొదలుపెట్టారని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేఎల్ రావు జయంతి నిర్వహించలేదన్నారు. అక్రమ ఇసుక తరలించడం మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అధికారులకు కూడ ఇంకా పాత వాసన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Home Minister Anitha: ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం..

నదులు అనుసంధానం గురించి చెప్పిన గొప్ప వ్యక్తి కేఎల్ రావు అని.. ఉమ్మడి ఏపీకి తాగు, సాగునీరు అందించిన వ్యక్తి కేఎల్ రావు అంటూ పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లాంటి అతిపెద్ద ప్రాజెక్ట్‌ను రాతితో కట్టారని.. కేఎల్ రావు ఆలోచనతో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పోలవరాన్ని వైసీపీ నాయకులు నాశనం చేశారని.. డయాఫ్రం వాల్ నాశనం కావడానికి మాజీ సీఎం జగనే కారణమని ఆయన ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తానని.. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్ళారని విమర్శించారు.