Nimmala Ramanaidu: ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది..
- ఇరిగేషన్ సీఈ.. ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేెశం
- జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయి- నిమ్మల
- ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది
- జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు.. గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి
- గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి- నిమ్మల రామానాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణ నిమిత్తం అంచనాలు వేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం కాల్వల్లో సిల్ట్ తీయలేదు.. తట్ట మట్టి కూడా ఎత్తలేదు.. జగన్ నిర్వాకం వల్ల వేలాది ఎకరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డీసిల్టింగ్ పనులకు అంచనాలు రూపొందించాలని సూచించాం.. పట్టిసీమ నిర్వహణ లేకపోవడం వల్ల పంపులు ఆన్ చేయగానే కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.
కృష్ణా డెల్టాకు సాగు నీరు సమస్య ఉంది.. సాగర్ ఆయకట్టులోని రైతులకు ఇబ్బందులున్నాయని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు నీరు రావాలంటే గోదావరి జలాలు తప్పని సరి అవుతోంది.. కృష్ణా నదిలో సరైన ఇన్ ఫ్లో ఉండడం లేదు.. పులిచింతలలో కేవలం అర టీఎంసీ నీటి నిల్వ కూడా లేకుండా పోయిందని అన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల కృష్ణాకు తాగు నీటి సమస్య కూడా వస్తోందని తెలిపారు. పట్టిసీమ లేకుంటే కృష్ణా ప్రజలు దాహార్తితో ఎండిపోయే పరిస్థితి వచ్చేది.. పోలవరంతో పాటు ఏపీలోని ప్రతి ప్రాజెక్టూ 20 ఏళ్ల వెనక్కు వెళ్లిపోయాయని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులకు కోసం కొంత మేర ఖర్చు పెట్టినా.. వాటిల్లో సగం నిధులు వైసీపీ నేతల జేబుల్లోకే వెళ్లాయని అన్నారు. ఐదేళ్లూ సరైన పని లేక అధికారుల్లో నిర్లిప్తిత కన్పిస్తోందని చెప్పారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ప్రజా ప్రభుత్వం రావడంలో ఉద్యోగుల పాత్ర కూడా ఉందని మంత్రి నిమ్మల తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులూ సహకరించాలని కోరుతున్నామన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ విషయంలో విదేశీ నిపుణులు నెలలో 10 రోజులు పరీక్షలు జరపాలి..
ప్రాజెక్టు సేఫ్టీ ముఖ్యం కాబట్టి.. కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని దాదాపు నిర్ణయించామన్నారు. డయాఫ్రం వాల్ కు రిపేర్లు చేయొచ్చనే ప్రతిపాదనలూ ఉన్నాయి.. అన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించిన ఖర్చును భరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. పట్టిసీమ పంపుల నుంచి నీటి విడుదల ప్రణాళికా బద్దంగా చేస్తున్నామని.. 15 పంపుల నుంచి నీటి విడుదల చేస్తున్నాం.. రెండు పంపుల్లో ప్రాబ్లం వచ్చిందని తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో 21 పంపులూ వదులుతాం.. కాల్వగట్లను పటిష్టం చేయాలని సూచించాం.. గండ్లు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించామని మంత్రి నిమ్మల చెప్పారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!