Minister Narayana: ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్ని హామీలు నెరవేరుస్తాం!
- రాజధాని గ్రామం ఐనవోలులో మంత్రి నారాయణ పర్యటన
- ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి గ్రామ సభలో పాల్గొన్న మంత్రి
- గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో రాజధాని గ్రామం ఐనవోలులో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు గ్రామ రైతులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ గ్రామ సభలో పాల్గొన్నారు. రాజధాని గ్రామాల అభివృద్ధి గురించి గ్రామస్థుల అభిప్రాయాలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టినట్లు మంత్రి, ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో ఇంకా అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా గ్రామస్థులను అడిగి తెలుసుకుంటూ, వారి సూచనలను గమనించారు.
గ్రామస్థులు ప్రస్తావించిన పలు అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ వెంటనే స్పందించారు. అడిగిన కార్యక్రమాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా హామీ ఇచ్చారు. ఒక్కో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నామో, ఏ ఏ పనులు కొనసాగుతున్నాయో గ్రామస్థులకు వివరించారు. ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధిని కూడా సమానంగా తీసుకెళ్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. సుమారు రూ.900 కోట్ల వ్యయంతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఆ దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
Also Read
- IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- High Protein Roti: హై ప్రోటీన్ రోటీ కావాలా? గోధుమ పిండిలో ఇదొక్కటి కలపండి.. సులభంగా కండరాలు పెరుగుతాయి..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
Also Read: Kambhampati Hari Babu: తెలుగు మహాసభల్లో పాల్గొనడం అపారమైన గౌరవంగా భావిస్తున్నా!
ఆరు నెలల్లోగా అన్ని రాజధాని గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను పూర్తిగా కల్పిస్తామని రైతులకు మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
-
King100: హీరోయిన్గా కాదు.. విలన్ గా టబు? నాగార్జున 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్!
-
ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
-
PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!