Nadendla Manohar: నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ.. పిఠాపురం నుంచి ప్రారంభం
- నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ
- పిఠాపురం నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో చౌక ధరల దుకాణాలు మళ్లీ తెరుచుకుంటున్నాయని సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. నేడు పిఠాపురంలో రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ రైస్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు నేటి నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీకి సిద్ధమయ్యారు.
Also Read:Russia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి
Also Read
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,74,057 మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరుకులు పంపిణీ చేయనున్నారు. 1 కోటి 46 లక్షల కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. ప్రతి రేషన్ దుకాణాల వద్ద విధిగా ధరలు, స్టాక్ బోర్డు, పోస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేపట్టనున్నారు. నేటి నుంచి నెలలో 15 రోజులపాటు.. రోజుకు రెండు పూటలు… చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేస్తారు. ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
-
US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
-
Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
-
Iran: ఖమేనీ శవపేటికకు ఫైటర్ జెట్లలో పహారా..
-
Ponnam Prabhakar : వర్షాకాలం.. బస్తీ దవాఖానలపై ప్రభుత్వం అలర్ట్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!