Minister KTR : ఈ తొమ్మిదేళ్లు సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ నిర్వహించిన బీసీ బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ తొమ్మిదేళ్లు సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చని వ్యాఖ్యానించారు. పేదలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కులవృత్తులను నమ్ముకున్న వారి కోసం పథకాలు అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. అందరి కంటే ఆర్థికంగా అడుగున ఉన్న వారి కోసం దళితబంధు అమలు చేస్తున్నామని, అంతే కాకుండా 14 వృత్తులపై ఆధారపడిన వారి కోసం బీసీ బంధు అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జిల్లాలో ఈ పథకం కింద 10 వేల దరఖాస్తులొచ్చాయి.. ఇవాళ తొలివిడతలో 600 మందికి ఇస్తున్నామని ఆయన అన్నారు. వచ్చే నెలలో మరికొందరికి ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.
Also Read : CCTV Camera: టమాటా పొలంలో సీసీటీవీ కెమెరాలు.. చోరీ జరగకుండా రైతు వినూత్న ఐడియా
Also Read
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- Jupally Krishna Rao: "లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా".. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్గా రికార్డ్..
దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద ఆర్థిక సహాయం చేస్తామని, వేములవాడ నుంచి కొందరు నార్లు వేస్తుంటే ..వాళ్ళను అడిగితే బెంగాల్ నుంచి వచ్చామన్నారని, ఇక్కడి నేతన్నలకు కూలి దొరకాలని బతుకమ్మ చీరల ఆర్డర్ తీసుకొస్తే అందులో పని చేస్తున్న వారంతా ఇతర రాష్ట్రాల వాళ్ళే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 12లక్షల మందికి కల్యాణ లక్ష్మి కింద నిధులిచ్చిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. పథకాల కింద వచ్చే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని, సెప్టెంబర్ లో సిరిసిల్లలో మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. మహబూబాద్ వెళ్ళినప్పుడు అక్కడి మెడికల్ కాలేజీ లో తెలుసుకుంటే 140 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని, రైతు బీమానే కాదు.. నేతన్న బీమా కూడా మొదలు పెట్టామన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Hima Varsha Reddy : శేషా రెడ్డి – నీరజా రెడ్డిల మాటే హిమ వర్షా రెడ్డి బాట
గతంలో పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు చనిపోతే.. వారి సంబంధీకులకు ఆ పింఛన్ వెంటనే బదిలీ చేసేటట్లు ఆదేశాలు ఇచ్చామని, బీసీ బంధు కింద చేసే ఆర్థిక సహాయం గ్రాంట్ మాత్రమే.. మీరు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నియోజక వర్గానికి 3000 చొప్పున గృహలక్ష్మి కింద ఆర్థిక సహాయం చేస్తాం ..జిల్లాలో ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తామన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఏదైనా మొదలు పెడితే పక్క నియోజక వర్గాల వాళ్ళు ఏడుస్తున్నారు.. అందుకే సీక్రెట్ చేస్తున్నా.. ఓట్లప్పుడు మందు పంచడం.. డబ్బులివ్వడం లాంటి అలవాటు లేదు.. మీరు కరుణిస్తే మళ్ళీ గెలుస్తా.. లేకపోతే ఇంట్లో కూచుంటా అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్గా రికార్డ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!