Minister KTR : మునుగోడులో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ప్రజలు పట్టంకట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానికి తెరపడింది. గత రెండు నెలలుగా మునుగోడు మేనియా తెలంగాణ హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 97,006 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 86,697 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే.. కాంగ్రెస్ 23,906 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ గలంతైంది. అయితే.. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి 10,309 మెజారిటీతో గెలుపొందారు.
Also Read : KTR Press Meet Live: మునుగోడు విక్టరీపై కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్
అయితే.. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో 12కి 12 స్థానాలు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమిత్ షా, మోడీ అహంకారానికి చెంపపెట్టులా మునుగోడు ప్రజలు తీర్చిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. 9 రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చారని ఆయన అన్నారు.
Also Read
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
Also Read : Big Breaking: మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం
మునుగోడులో అభివృద్ధికి, అహంకారానికి మధ్య జరిగినపోరు అని, రాజకీయాల్లో హత్యలు ఉండవు… ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని, టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో కృషిచేసిన వామపక్ష నేతలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. డబ్బుతో జనం గొంతు నొక్కాలని బీజేపీ చూసిందని, వందలకోట్లు దొరికాయని మేం ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ మౌనంగా లేదా..? అని ఆయన ప్రశ్నించారు. ఈటల, రాజగోపాల్ రెడ్డితో ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని, ఓటమిని అంగీకరించే దమ్ముండాలన్నారు మంత్ర కేటీఆర్. బీజేపీ నేతలు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. గత ఎన్నికతో పోలిస్తే టీఆర్ఎస్కు 9శాతం ఓట్లు పెరిగాయని, కారును పోలిన గుర్తులకు దాదాపు 6 వేల ఓట్లు పడ్డాయన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
-
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!