Kolusu Partha Sarathy: విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం!
- స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం
- విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర
- సొంత ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఢిల్లీ పర్యటనలు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం అని మంత్రి కోలుసు పార్థ సారథి అన్నారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ప్లాంట్ను కేంద్రం వదులుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి నారా లోకేష్ గతంలోనే నిర్ణయించారని మంత్రి కోలుసు గుర్తుచేశారు. గతంలో 21 ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల గాలికి వదిలేసారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకంకి స్టీల్ ప్లాంట్ నిధులు ఒక తార్కాణం అని మంత్రి పేర్కొన్నారు.
Also Read: BJP President: బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవం.. స్పందించిన పురందేశ్వరి!
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
మంత్రి కోలుసు పార్థ సారథి మాట్లాడుతూ… ‘విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఉత్తరాంధ్ర ప్రజలు, టీడీపీ, జనసేన, ప్లాంట్ కార్మికులు సుదీర్ఘ పోరాటం చేశారు. ప్లాంట్ను కేంద్రం వదులుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి లోకేష్ గతంలోనే నిర్ణయించారు. గత ప్రభుత్వ పెద్దలు ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా.. రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేకపోయారు. గతంలో 21 ఎంపీలు ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసింది. సొంత ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఢిల్లీ పర్యటనలు చేశారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు వేల కోట్లు నిధులు సాధించారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకంకి స్టీల్ ప్లాంట్ నిధులు ఒక తార్కాణం’ అని చెప్పారు.
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!