Jupally Krishna Rao: అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ హరీశ్ రావు స్పందిస్తారు!
- ఎస్ఎల్బీసీ టన్నెల్ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు?
- హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడు
- రాజకీయ లబ్ధి కోసం డ్రామా చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎల్బీసీ టన్నెల్ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అని హరీశ్ రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేక పోయారన్నారు. హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీశ్ రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్ రావు ఎందుకు రాలేదు? అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. గాంధీ భవన్లో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు.
‘ఎస్ఎల్బీసీ టన్నెల్కి హరీష్ రావు వంద వాహనాల్లో యుద్ధానికి వెళ్లినట్టు వచ్చారు. అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ ఆయన స్పందిస్తారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేకపోయారు. డబ్బులు లేక తవ్వలేదా ఎస్ఎల్బీసీ లేదా.. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని తవ్వలేదా?. హరీష్ సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడు. ప్రమాదం జరగగానే హరీష్ ఎందుకు రాలేదు. నేను ఒక్కడినే టన్నెల్ లోపలికి వెళ్ళాను. టన్నెల్లోకి వాటర్, బురద వచ్చి ముసుకుని పోయింది. అది తీస్తే మరలా వరద వస్తది కదా. 8 మందిని తీయడానికి 100 మంది లోపలికి పోయారు. బురద, నీళ్లు వస్తున్నప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగితే.. ఇంకో ఘటన జరుగుతుంది కదా?. జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జాతీయ సంస్థలు అన్నీ వచ్చాయి, ఆ సంస్థలు చెప్పినట్టు చేస్తున్నాం’ అని మంత్రి జూపల్లి తెలిపారు.
Also Read
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
‘జిల్లా మంత్రిగా నేనే టన్నెల్లోకి వెళ్లి వచ్చా. మమ్మల్ని రానివ్వలేదు అని కొందరు డ్రామా చేశారు. రావడానికి అనుమతి ఇచ్చింది మేమే, రాజకీయ లబ్ధి కోసం డ్రామా చేస్తున్నారు. మీరేమైనా అధికారంలో ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారా?. వచ్చి చూడాలి అనుకుంటే.. 100 వాహనాల్లో వస్తారా?. పాలమూరు రంగారెడ్డిలో ప్రమాదం జరిగితే కేసీఆర్ వచ్చాడా?.. పవర్ హౌస్ మునిగితే కేసీఆర్ వచ్చాడా?, మంత్రి వచ్చాడా?.. కొండగట్టు ప్రమాదంలో 65 మంది చనిపోతే కేసీఆర్ వెళ్ళాడా?.. కాళేశ్వరం టన్నెల్లో ఏడుగురు చనిపోయినపుడు కేసీఆర్, హరీష్ పోయాడా?’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!