Jupally Krishna Rao: అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ హరీశ్ రావు స్పందిస్తారు!
- ఎస్ఎల్బీసీ టన్నెల్ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు?
- హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడు
- రాజకీయ లబ్ధి కోసం డ్రామా చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎల్బీసీ టన్నెల్ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అని హరీశ్ రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేక పోయారన్నారు. హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీశ్ రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్ రావు ఎందుకు రాలేదు? అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. గాంధీ భవన్లో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు.
‘ఎస్ఎల్బీసీ టన్నెల్కి హరీష్ రావు వంద వాహనాల్లో యుద్ధానికి వెళ్లినట్టు వచ్చారు. అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ ఆయన స్పందిస్తారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేకపోయారు. డబ్బులు లేక తవ్వలేదా ఎస్ఎల్బీసీ లేదా.. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని తవ్వలేదా?. హరీష్ సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడు. ప్రమాదం జరగగానే హరీష్ ఎందుకు రాలేదు. నేను ఒక్కడినే టన్నెల్ లోపలికి వెళ్ళాను. టన్నెల్లోకి వాటర్, బురద వచ్చి ముసుకుని పోయింది. అది తీస్తే మరలా వరద వస్తది కదా. 8 మందిని తీయడానికి 100 మంది లోపలికి పోయారు. బురద, నీళ్లు వస్తున్నప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగితే.. ఇంకో ఘటన జరుగుతుంది కదా?. జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జాతీయ సంస్థలు అన్నీ వచ్చాయి, ఆ సంస్థలు చెప్పినట్టు చేస్తున్నాం’ అని మంత్రి జూపల్లి తెలిపారు.
Also Read
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
- Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ 'రాగి మిల్క్'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
‘జిల్లా మంత్రిగా నేనే టన్నెల్లోకి వెళ్లి వచ్చా. మమ్మల్ని రానివ్వలేదు అని కొందరు డ్రామా చేశారు. రావడానికి అనుమతి ఇచ్చింది మేమే, రాజకీయ లబ్ధి కోసం డ్రామా చేస్తున్నారు. మీరేమైనా అధికారంలో ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారా?. వచ్చి చూడాలి అనుకుంటే.. 100 వాహనాల్లో వస్తారా?. పాలమూరు రంగారెడ్డిలో ప్రమాదం జరిగితే కేసీఆర్ వచ్చాడా?.. పవర్ హౌస్ మునిగితే కేసీఆర్ వచ్చాడా?, మంత్రి వచ్చాడా?.. కొండగట్టు ప్రమాదంలో 65 మంది చనిపోతే కేసీఆర్ వెళ్ళాడా?.. కాళేశ్వరం టన్నెల్లో ఏడుగురు చనిపోయినపుడు కేసీఆర్, హరీష్ పోయాడా?’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!