Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..
- కేసీఆర్పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపాటు
- కేసీఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jupalli Krishna Rao: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. నిన్న బడ్జెట్ మీద పదేళ్లు అనుభవం ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బడ్జెట్ విషయంలో చీల్చి చెండాడుతాం అన్నారని.. అలాంటి కేసీఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదని విమర్శించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటి సారి బడ్జెట్ పెట్టినా.. మీలాగా గ్యాస్…స్ట్రాష్ బడ్జెట్ పెట్టలేదంటూ పేర్కొన్నారు. పదేళ్లు ఆదాయానికి మించి ఖర్చు చేస్తామని.. కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ తెలిపారు. మోసం చేయకుండా.. వాస్తవాలకు దగ్గరగా ఎంత వస్తే అంతే ఖర్చు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులను నట్టేట ముంచుతున్నామని కేసీఆర్ మాట్లాడుతున్నారని.. రైతు బంధు ఎత్తివేయలేదు కదా అంటూ మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన దానికి ఎక్కడా తగ్గించలేదన్నారు. రైతులకు 31వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం.. ఎలా నట్టేట ముంచినట్లు అవుతుందని ప్రశ్నించారు.
Read Also: SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
Also Read
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
రైతు బీమా కొనసాగిస్తున్నామని.. పంట బీమా కొత్తగా తీసుకువస్తున్నామన్నారు. క్వింటాల్కు రూ.500 రూపాయలు బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. కేసీఆర్ తల తోక లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని.. ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీష్ రావు పరిస్థితి ఉందన్నారు. మేము తెచ్చిన అప్పుల కన్నా.. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎక్కువగా తీర్చుతున్నామని మంత్రి అన్నారు. అసెంబ్లీకి ఎందుకు రావు.. అసెంబ్లీ అంటే అంత చిన్న చూపా అంటూ కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, అంబేడ్కర్ గురించి మాట్లాడుతున్నారు.. అగౌరవపరిచింది మీరే అంటూ మంత్రి విమర్శలు గుప్పించారు.
బడ్జెట్లో 17శాతం కేసీఆర్ చేసిన అప్పులకే సరిపోతుందని అన్నారు. నెలకు 4-5 వేల కోట్లు అప్పుల వడ్డీలకు సరిపోతుందన్నారు. కేసీఆర్ తుగ్లక్ పాలన కాకుండా బాగా పరిపాలన చేసి ఉంటే.. తెలంగాణ అభివృద్ధిలో ఎక్కడో ఉంటుండే అంటూ మంత్రి అన్నారు.
ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం మోపలేదన్నారు. అయినా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీలాగా అడ్డగోలుగా దోచుకునే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. 7వ గ్యారంటీ ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారని.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?