Minister Jogi Ramesh: డర్టీ బాబు, డస్ట్బిన్ మేనిఫెస్టో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఓ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డర్టీ బాబు, డస్ట్బిన్ మేనిఫెస్టో అంటూ చంద్రబాబు, టీడీపీ మేనిఫెస్టో పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ 2014 టీడీపీ మేనిఫెస్టోను చూయించారు.. అంతేకాదు.. ఆ మేనిఫెస్టోను చించి డస్ట్ బిన్ లో వేశారు జోగి రమేష్..
Read Also: Chandrayaan 3: చంద్రయాన్ 3పై ఇస్రో చీఫ్ కీలక ప్రకటన.. ప్రయోగం ఎప్పుడంటే..?
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
2014 టీడీపీ మేనిఫెస్టోపై, 2019లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు సవాల్ చేశారు జోగి రమేష్.. అయినా మీరు చర్చకు రాలేరులే.. అంత దమ్ము లేదు చంద్రబాబుకు, ఆయన తాబేదారులకు అంటూ ఎద్దేవా చేశారు.. 450కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడని ఆరోపించారు.. కానీ, ప్రభుత్వం 98 శాతం మేనిఫోస్టోలని హామీలను అమలు చేసిందని స్పష్టం చేశారు. ప్రతి గడపలో, ప్రతి ఊర్లో ప్రభుత్వ పథకాలు కనిపిస్తాయి.. ఏ రాష్ట్రంలో అయినా నాలుగేళ్లల్లో ఇన్ని పథకాలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక నకిలీ, పిరికిపంద, పనికిమాలిన వాడు.. పార్టీని దొంగతనం చేశాడు.. పొత్తుల్లో పొర్లాడుతుంటాడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్.
2024 ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ గల్లంతు అవుతుంది అన్నారు జోగి రమేష్.. రైతు రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏటా 20 వేలు ఇస్తానంటున్నాడు.. బీసీలకు రక్షణ కవచం అట.. బీసీలను భక్షించిందే నువ్వు కదా? బీసీ వర్గాలను తొక్కి నార తీశాడు అని విమర్శించారు. బీసీల ఆత్మగౌరవం వైఎస్ జగన్..
పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.. ఇప్పుడు పేదలను ధనవంతులను చేస్తానని అంటున్నాడు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!