Site icon NTV Telugu

Gudivada Amarnath: ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగింది

Gudivada Amarnath,

Gudivada Amarnath,

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద తెస్తుందని చెబుతున్నారు మంత్రి అమర్నాథ్. వచ్చే విద్యా సంవత్సరంలో సీఎం వైజాగ్ రాబోతున్నారు….. సీఎం ప్రకటించే నాటికి నెలల్లో ఉన్న సమయం ఇప్పుడు రోజుల్లోకి వచ్చింది. 13లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పుడు ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగానే ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించ లేకపోయాం……ఈనెల 18 తర్వాత విడుదల అవుతుంది. డిసెంబర్ 23 నాటికి రామాయపట్నం ఆపరేషన్స్ ప్రారంభం అవుతాయి….ఆ రోజు తొలి వెసల్ రాబోతోందన్నారు.

Read Also: Tollywood: పరీక్షల కారణంగా కొన్ని వెనక్కి… అదే అదనుగా కొన్ని ముందుకు!

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం అన్నారు. జగ్మోహన్ రెడ్డి బ్రాండ్., కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించామన్నారు. మూడేళ్ళలో ఒప్పందం చేసుకున్న 89శాతం పెట్టుబడు లను రాబట్టగలగడం వైసీపీ ప్రభుత్వంకు ఉన్న ట్రాక్ రికార్డ్. ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వచ్చే నెల నుంచి కార్యాచరణలోకి వస్తాయన్నారు. చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ ప్రతీవారం సమీక్షిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను లీజ్ డీడ్ విధానం అనుసరిస్తున్నాం. ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన 35వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చాయన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read Also: Minister KTR : ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే

Exit mobile version