Minister Atchannaidu: కేరళ తరహాలో తీర ప్రాంత అభివృద్ధి.. వేట నిషేధ భృతి అమలుకు చర్యలు
- కేరళ తరహాలో తీర ప్రాంత అభివృద్ధి
- వేట నిషేధ భృతి అమలుకు చర్యలు
- హార్బర్ల అభివృద్ధికి ప్రణాళిక
- మత్స్య శాఖపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: కేరళ తరహాలో తీర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని, అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మత్స్య శాఖపై మంత్రి అచ్చెన్నాయుడు మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్.ఎమ్.నాయక్తో కలిసి సమీక్ష నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ భృతి 20 వేలుకు పెంచి అందించే ప్రక్రియకు సన్నాహాలు చేయాలని, నిజమైన లబ్ధిదారుల ఎంపిక గురించి చేపట్టే సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
Read Also: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
Also Read
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
మత్స్యకారుల బోట్లకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు అమర్చడం, డీజిల్ వినియోగం స్థానంలో మెరైన్ ఫ్యూయల్ వినియోగం వంటి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మత్స్య శాఖలో ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు అంశంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు చర్చించారు. సీడ్ స్టాకింగ్ వ్యవస్థను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. బాదంపూడి, కొవ్వలి సీడ్ పాండ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 8 హార్బర్ల అభివృద్ధికి దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2014 – 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవంతంగా మత్స్యకారుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు తిరిగి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. సమీక్షా సమావేశంలో మత్స్య శాఖ కమిషనర్ టి.డోలా శంకర్, ఇతర మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!