Minister Ambati Rambabu: పోలవరంపై టీడీపీది తప్పుడు ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం విషయంలో టీడీపీది తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం జాప్యానికి కారణం జగన్ ప్రభుత్వం అని బ్రాండింగ్ చేయటానికి టీడీపీ, టీడీపీ మద్దతు మీడియా ప్రయత్నం చేస్తున్నదన్నారు. టీడీపీ ప్రభుత్వం దుర్మార్గం చేసింది. కాఫర్ డ్యాం లేకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టిన ప్రబుద్ధులు టీడీపీ నేతలు. స్పిల్ వే నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారు? రూ.400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందన్నారు మంత్రి అంబటి.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
దాన్ని ఎలా పునరుద్ధరించాలా అని నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు సక్రమంగా ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఈ స్థాయిలో వరదలు వచ్చినా ఒక్క ప్రాణ నష్టం జరక్కుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఏమయ్యా రాంబాబు అంటున్నాడు దేవినేని ఉమ. మరోసారి ఇలా అంటే నేను కూడా ఒరేయ్…తురేయ్ అనాల్సి ఉంటుందన్నారు. పోలవరం నిర్మాణం జరుగుతున్నా…లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ప్రాజెక్టుకు నష్టం జరక్కుండా కంటికి రెప్పలా కాపాడాం అన్నారు అంబటి.
వరదల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది. టీడీపీ హయాంలోనే తప్పిదాలుఏ ఎక్కువగా జరిగాయన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత టీడీపీకి, అప్పటి మంత్రి దేవినేని ఉమా లేదన్నారు. దొంగలు పట్ట ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుగా చంద్రబాబు వరద ప్రాంతాలకు ఇప్పుడు వెళ్లడం ఏంటని మండిపడ్డారు అంబటి. ప్రజల్ని రెచ్చగొట్టే కామెంట్లు చేయవద్దన్నారు. పుట్టగానే డయాఫ్రం వాల్ గురించి తెలియదన్నారు. మంత్రిని అయ్యాక అన్నీ తెలుసుకుంటున్నానన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి అన్ని విషయాలు పరిశీలించాకే కేంద్రం అనుమతి వచ్చిందన్నారు. తెలంగాణకు ఎలాంటి నష్టం రాదన్నారు.
నేను కాంట్రాక్టర్నా? ఇంజనీర్నా? తెలియటానికి. నాకు కామన్ సెన్స్ ఉంది… చిత్తశుద్ధి ఉంది. ఆరోగ్య శాఖ మంత్రికి ఆపరేషన్ చేయటం రావాలా?? ఎదుటి వాళ్ళను గేలి చేయాలని ప్రయత్నించటం దుర్మార్గం అన్నారు మంత్రి అంబటి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!