Millet Breakfast: ఈ చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్తో రోజంతా ఫుల్ ఎనర్జీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Millet Breakfast: ఆధునిక సాంకేతిక యుగంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం సవాలుగా మారింది. ముఖ్యంగా ఉదయం తీసుకునే అల్పాహారం మన రోజంతా ఉండే శక్తిని నిర్ధారిస్తుంది. ఈ సందర్భంగా పలువురు పోషకాహార నిపుణులు మాట్లాడుతూ.. మన పూర్వీకుల ఆహారపు అలవాట్లను మళ్లీ మన పళ్లెంలోకి తెచ్చుకుంటే, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు. బియ్యం, మైదాతో చేసిన ఇడ్లీ, దోశలకు భిన్నంగా.. జొన్నలు, రాగి, సజ్జలు వంటి తృణధాన్యాలతో చేసే అల్పాహారం అమృతంతో సమానం అని పేర్కొన్నారు. వీటిలో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని వెల్లడించారు. ఈ స్టోరీలో జొన్నలు, రాగి, సజ్జలు వంటి తృణధాన్యాలతో సింఫుల్గా తయారు చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందాం.
READ ALSO: Sree Vishnu: శ్రీవిష్ణు Vs శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ వద్ద నాతో నాకే పోటీ అంటున్న యువ హీరో!
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
హెల్తీ బ్రేక్ఫాస్ట్ను ఇలా రెడీ చేసుకోండి..
జొన్న రొట్టెలు: జొన్నల పిండిని మరగబెట్టిన నీటితో కలిపి మెత్తగా చేయడం వల్ల జొన్న రొట్టెలు మృదువుగా వస్తాయి. వీటిలో ఉండే ప్రొటీన్లు కండరాల పుష్టికి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు సూచించారు.
రాగి జావ/అంబలి: నిజానికి రాగి జావ అనేది కాల్షియం నిధిగా చెబుతారు. రాగులతో జావ చేసుకుని తాగితే ఎముకలు బలంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, మహిళలకు రాగి జావను వారి రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలని వెల్లడించారు.
ముడి ధాన్యాల కిచిడీ: కూరగాయ ముక్కలు కలిపి వండుకునే సిరిధాన్యాల కిచిడీ విటమిన్ల గని గా పేర్కొన్నారు.
ఈ బ్రేక్ ఫాస్ట్లతో ఉపయోగాలు ఇవే..
బరువు నియంత్రణ: ఈ ఆహారం తీసుకున్నప్పుడు కడుపు నిండుగా అనిపించి, అనవసరమైన చిరుతిళ్లపై మనసు పోదు.
గుండెకు మేలు: పీచు పదార్థం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
తక్షణ శక్తి: గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల నీరసం రాకుండా రోజంతా హుషారుగా ఉండవచ్చు.
ఈ సందర్భంగా ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ.. ఉదయం పూట నూనెలో వేయించిన పదార్థాల కంటే, ఆవిరిపై ఉడికించిన లేదా సహజ సిద్ధమైన తృణధాన్యాలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. మనం తీసుకునే ఆహారం మనకు ఔషధం కావాలని అనారోగ్య సమస్యలకు దారి తీసేదిగా ఉండకూడదని చెబుతున్నారు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, దానిని రుచి కోసం కాకుండా, ఆరోగ్యం కోసం ఆలోచించి తీసుకోవాలి సూచించారు.
READ ALSO: Maha Shivaratri 2026: రేపే మహాశివరాత్రి.. ఈ తప్పులు చేస్తే పుణ్యం రాదు సరే కదా.. మహా పాపం!
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!