MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. ముంబై మొదట బ్యాటింగ్ చేపట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగుల భారీ స్కోరును చేసినది. ఇక ఈ ఇన్నింగ్స్ లో ర్యాన్ రికెల్టన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 58 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు, చివరిలో నామన్ ధీర్ 11 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సులతో 25 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. ఇక వీరితోపాటు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలో రోహిత్ శర్మ (12) దూకుడుగా ఆడదానికి ప్రయత్నించి మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (29), తిలక్ వర్మ (6) హార్దిక్ పాండ్యా (5) త్వరగా ఔట్ కావడంతో ముంబై కొంత ఒత్తిడిలో పడింది. అయితే, నమన్ ధీర్, కార్బిన్ బాష్ చివరి ఓవర్లలో వేగంగా పరుగులు జోడించడంతో జట్టు భారీ స్కోరును సాధించింది. మొత్తం మీద, ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ ముందు గట్టి లక్ష్యాన్ని ఉంచింది.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, రవి బిష్ణోయ్ లు చెరో వికెట్ సాధించారు. చూడాలి మరి లక్నో ఈ భారీ లక్షాన్ని ఛేదించి విజయాన్ని సాధిస్తుందో.. లేక, ముంబై వరుస విజయాల పరంపరను కొనసాగిస్తుందో.