Nara Lokesh Whatsapp Block: మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక సూచన
- మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్..
- ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది..
- మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ చేయొద్దు అని లోకేష్ సూచన..
- మీ సమస్య ఏదైనా.. సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీకి పంపాలి..
- hello.lokesh@ap.gov.in కి మెయిల్ చేస్తే నేను పరిశీలిస్తానన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh Whatsapp Block: మంత్రి నారా లోకేష్ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.. ఫోన్ కాల్తో.. చివరకు తనకు మెసేజ్ వచ్చినా స్పందిస్తూ.. ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు.. ఓవైపు ప్రజా దర్భార్తో ప్రజల సమస్యల నుంచి వినతులు స్వీకరిస్తూ.. మరోవైపు.. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.. అయితే, మంత్రి నారా లోకేష్ వాట్సాప్ను బ్లాక్ చేసింది మెటా.. దానికి ఓ ప్రధాన కారణం ఉంది.. పెద్ద ఎత్తున వాట్సాప్ కు మెసేజ్లు వస్తుండడంతో మెటా.. మంత్రి లోకేష్ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసింది.. ఈ నేపథ్యంలో.. ప్రజలకు కీలక సూచనలు చేశారు మంత్రి.. ప్రజలు తమ సమస్యలు తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.inకి పంపాలని విజ్ఞప్తి చేశారు.. తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు..
Read Also: Stock market: ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని సూచించారు మంత్రి నారా లోకేష్.. సాయం కోసం వచ్చే ప్రజలకు నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న ఆయన.. నేనే అందరి సమస్యలు నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అన్నారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని పేర్కొన్నారు.. తనకు మెయిల్ చేస్తే తాను స్పందిస్తాను అన్నారు.. వాట్సాప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్లు చూసే అవకాశం ఉండటం లేదు.. దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని కోరారు మంత్రి నారా లోకేష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మంత్రి లోకేష్. కాగా, సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం మంత్రి లోకేష్ నిర్వహిస్తోన్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఆయన్ని నేరుగా కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. వారి సమస్యలను ఓపిగా వింటూ.. వాటి పరిష్కారానికి పూనుకుంటున్నారు.
https://x.com/naralokesh/status/1811339925024874808
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?