Nara Lokesh Whatsapp Block: మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక సూచన
- మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్..
- ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది..
- మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ చేయొద్దు అని లోకేష్ సూచన..
- మీ సమస్య ఏదైనా.. సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీకి పంపాలి..
- hello.lokesh@ap.gov.in కి మెయిల్ చేస్తే నేను పరిశీలిస్తానన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh Whatsapp Block: మంత్రి నారా లోకేష్ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.. ఫోన్ కాల్తో.. చివరకు తనకు మెసేజ్ వచ్చినా స్పందిస్తూ.. ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు.. ఓవైపు ప్రజా దర్భార్తో ప్రజల సమస్యల నుంచి వినతులు స్వీకరిస్తూ.. మరోవైపు.. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.. అయితే, మంత్రి నారా లోకేష్ వాట్సాప్ను బ్లాక్ చేసింది మెటా.. దానికి ఓ ప్రధాన కారణం ఉంది.. పెద్ద ఎత్తున వాట్సాప్ కు మెసేజ్లు వస్తుండడంతో మెటా.. మంత్రి లోకేష్ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసింది.. ఈ నేపథ్యంలో.. ప్రజలకు కీలక సూచనలు చేశారు మంత్రి.. ప్రజలు తమ సమస్యలు తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.inకి పంపాలని విజ్ఞప్తి చేశారు.. తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు..
Read Also: Stock market: ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
- Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని సూచించారు మంత్రి నారా లోకేష్.. సాయం కోసం వచ్చే ప్రజలకు నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న ఆయన.. నేనే అందరి సమస్యలు నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అన్నారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని పేర్కొన్నారు.. తనకు మెయిల్ చేస్తే తాను స్పందిస్తాను అన్నారు.. వాట్సాప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్లు చూసే అవకాశం ఉండటం లేదు.. దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని కోరారు మంత్రి నారా లోకేష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మంత్రి లోకేష్. కాగా, సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం మంత్రి లోకేష్ నిర్వహిస్తోన్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఆయన్ని నేరుగా కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. వారి సమస్యలను ఓపిగా వింటూ.. వాటి పరిష్కారానికి పూనుకుంటున్నారు.
https://x.com/naralokesh/status/1811339925024874808
తాజావార్తలు
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..