కొత్త ఏడాదిలో వినియోగదారులకు Mercedes-Benz షాకింగ్ న్యూస్.. మరింత పెరగనున్న కార్ల ధరలు
- కొత్త ఏడాదిలో వినియోగదారులకు Mercedes-Benz షాకింగ్ న్యూస్..
- 2026 జనవరి 1 నుంచి అన్ని మోడళ్లపై 2% వరకు ధరల పెరుగుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mercedes-Benz: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) 2 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లగ్జరీ ఆటోమొబైల్ మార్కెట్పై ప్రభావం చూపుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ అస్థిరత, ముడిసరుకు ధరల పెరుగుదల, లాజిస్టిక్స్ సమస్యలు కారణంగా ఆపరేషనల్ ఖర్చులు భారీగా పెరిగినట్లు మెర్సిడెస్-బెంజ్ సంస్థ స్పష్టం చేసింది. వీటన్నింటి ప్రభావంతో ధరలను స్వల్పంగా సవరించాల్సి వచ్చిందని తెలిపింది.
Also Read
- Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
- NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
- Danger Warnings: గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలో కలకలం.. రంగంలోకి సహాయక బృందాలు..
- Nirmal Purja: ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి
ఇక మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రకారం.. 2025 మొత్తంలో యూరో, రూపాయి మారకం విలువ రూ. 100కు పైగానే కొనసాగింది. ఇది గత సగటు స్థాయిలతో పోలిస్తే ఎక్కువ. దీని వల్ల లోకల్ అస్సెంబెలింగ్ కోసం దిగుమతి చేసే భాగాలు, అలాగే పూర్తిగా దిగుమతి చేసుకునే కార్లు (CBUs) ఖర్చులు పెరిగాయి. ఫలితంగా కంపెనీ మొత్తం కార్యకలాప వ్యయం ఎక్కువైంది. లోకలైజేషన్ వ్యూహం ద్వారా ఈ ఖర్చులలో చాలా భాగాన్ని సంస్థ భరించినప్పటికీ, వ్యాపార స్థిరత్వం కోసం పరిమిత స్థాయిలో ధరల సవరణ అవసరమైందని కంపెనీ పేర్కొంది.
John Cena: రిటైర్మెంట్ మ్యాచ్లో ఓడిపోయిన జాన్సీనా.. ఓడించింది ఇతనే!
ఈ విషయంపై మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో మాట్లాడుతూ.. ఈ ఏడాది మేము ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కరెన్సీ ఒత్తిళ్లు కొనసాగాయి. యూరో విలువ నిరంతరం 100కు పైగా ఉండటం వల్ల దిగుమతి భాగాలు, పూర్తిగా దిగుమతి కార్లు సహా మా కార్యకలాపాలన్నింటిపై ప్రభావం పడింది. అంతేకాదు ముడిసరుకు ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా మొత్తం ఆపరేషనల్ ఖర్చులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. అదే సమయంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గింపులు మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా కస్టమర్లకు ప్రయోజనంగా మారాయని, దీని వల్ల ధరల పెంపు ప్రభావం కొంత మేర తగ్గిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
-
Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
-
CM Revanth Reddy : చెరువులకు మళ్లీ జీవం.. HYDRAAపై సీఎం ప్రశంసలు.!
-
NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
-
Nithiin : నాని ప్రొడక్షన్లో నితిన్ కొత్త సినిమా
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!