OTT Release: మెగా అభిమానులతో పాటు సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్లో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచి మెగాస్టార్ సినీ కెరీర్లో మరోమైలు రాయిగా అవతరించింది.
READ ALSO: Devara 2 Update: ‘దేవర 2’ అదిరిపోయే అప్డేట్.. ఈసారి థియేటర్లు దద్దరిల్లాల్సిందే?
ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం తాజాగా డిజిటల్ తెరపై సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన జీ5 స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇందులో విశేషం ఏమిటంటే బాస్ సినిమా ఏకంగా ఏడు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ) స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2026న డిజిటల్ ప్రీమియర్ కానుందని టాక్. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీ రోల్లో సందడి చేశారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.
మన శంకర వరప్రసాద్ గారు కథ విషయానికి వస్తే..
శంకర వరప్రసాద్ (చిరంజీవి) ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కీలక అధికారి. అతను హోం మినిస్టర్ దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసే ఓ డైవర్సీ. ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్ శశిరేఖ (నయనతార)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శంకర వరప్రసాద్, తన పిల్లల్ని బాగా మిస్ అవుతూ ఉంటాడు. పిల్లలకు దగ్గరయ్యే ఉద్దేశంతో శశిరేఖకు తెలియకుండా కొన్ని ప్రయత్నాలు చేసినా, అవి పూర్తిస్థాయిలో సఫలం కావు. అయితే, శశిరేఖ తండ్రి జీవీఆర్ మీద అటాక్ జరగడంతో.. వారికి సెక్యూరిటీ ఆఫీసర్గా శంకర వరప్రసాద్ రంగంలోకి దిగుతాడు. అసలు శంకర వరప్రసాద్కు, శశిరేఖకు ప్రేమ ఎలా పుట్టింది? వారికి విడాకులు ఎలా అయ్యాయి? అసలు శశిరేఖ తండ్రి మీద అటాక్ చేసింది ఎవరు? ఆ ఎటాక్ చేసిన వ్యక్తిని శంకర వరప్రసాద్ అండ్ టీం కనుక్కుందా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
READ ALSO: Dhurrander 2: అడివి శేష్ వర్సెస్ రణ్వీర్ సింగ్.. డెకాయిట్ రిలీజ్ డేట్ మారబోతుందా?