Hyderabad Metro : మెట్రో స్టేషన్లలో సంక్రాంతి సంబరాలు.. డ్యాన్సులు, పాటలతో జోష్..!
- హైదరాబాద్ మెట్రోలో సంక్రాంతి సంబరాలు
- మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్
- కోఠి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో ప్రారంభం
- మూడు రోజుల పాటు వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ ప్రారంభమైంది. నేటి నుంచి(8,9,10) మూడు రోజుల పాటు మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ పేరిట కోఠి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో పాటు ఇతర మెట్రో ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు.
READ MORE: Prabhas New Look: న్యూ లుక్లో ప్రభాస్.. ఆ దర్శకుడి కోసమా?
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
హైదరాబాద్ మెట్రో ఇంజనీరింగ్ అద్భుతం చేసిందని హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రోలను రైల్వే ఇంజనీర్లు ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుగా చేపడతారని…. తాము హైదరాబాద్ మెట్రోను కేవలం ట్రాన్స్పోర్ట్ మోడ్ మాత్రమే కాకుండా నగరం ఆత్మ ప్రతిబింబించేలా నిర్మించామన్నారు. 2013లో ప్రపంచంలోని టాప్ 100 ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకదానిలో మెట్రో రైల్ నిలిచిందన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 90 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తే రోడ్లన్నీ జామ్ అవుతాయని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం మాత్రమే ఉపయోగపడుతుందని వెల్లడించారు.
READ MORE: ACB : ముందు మీరు విచారణకు రండి.. తర్వాత చెప్తాం.. కేటీఆర్కు ఏసీబీ సెకండ్ నోటీసు
మెట్రో లాంటి వ్యవస్థలు ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో రైలు జర్నీని ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారన్నారు. ప్రయాణికుల టాలెంట్ను చూపించేందుకు మీ టైం ఆన్ మై మెట్రో కాంపియన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లలో టాలెంట్ చూపించేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లలో టాలెంటును షో కేస్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్నారు. డాన్సులు, సంగీతం వంటి అంశాలు మీరు ప్రదర్శించవచ్చని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ మెట్రో ప్రాజెక్టు పై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని గుర్తు చేశారు. “ప్రపంచ దేశాలకు ధీటుగా హైదరాబాద్ మెట్రో విస్తరణ చేయాలని సీఎం అన్నారు. హైదరాబాద్ను విశ్వ నగరాన్ని చేయడానికి మెట్రో కీలక పాత్ర పోషిస్తుంది.. 50,60 ఎకరాల్లో మంచి హబ్ను ఏర్పాటు చేసి మెట్రోను డెవలప్ చేయలన్నారు సీఎం.. కేంద్రం దృష్టికి మెట్రో విస్తరణ పై సీఎం అనేక అంశాలను తీసుకెళ్లారు.. మెట్రో తో పాటు హైద్రాబాద్ అభివృద్ధి ప్రపోజల్స్ ను కేంద్రం ముందు ఉంచారు..” అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!