Site icon NTV Telugu

Meenakshi Chaudhary : బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో మీనాక్షి చౌదరి.!

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

టాలీవుడ్‌లో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు నేరుగా బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ప్రాజెక్ట్‌లో చోటు సంపాదించుకుంది. 2006లో సంచలన విజయం సాధించిన కామెడీ థ్రిల్లర్ ‘భాగమ్ భాగ్’ (Bhagam Bhag) సీక్వెల్‌లో మీనాక్షి కథానాయికగా నటించబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Hot Spot 2 : ‘హాట్ స్పాట్ 2 మచ్’.. వినోదానికి రెట్టింపు డోస్ అందించే కొత్త చిత్రం

ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘భాగమ్ భాగ్’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి దర్శకత్వ బాధ్యతలను రాజ్‌ శాండిల్యకు అప్పగించినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరితో పాటు, ‘ధురంధర్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న ఆయేషా ఖాన్ కూడా మరో హీరోయిన్‌గా నటించనుందట. కాగా మీనాక్షి ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన ‘వృషకర్మ’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. అటు సౌత్‌లో టాప్ హీరోలతో నటిస్తూనే, ఇటు బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వడం మీనాక్షికి పెద్ద ప్లస్ కానుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. కామెడీ టైమింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ సీక్వెల్‌లో మీనాక్షి ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version