Raging in MBBS College: ఎంబీబీఎస్ కాలేజీలో ర్యాగింగ్.. 3 గంటలు నిలబడి డ్యాన్స్ చేస్తూ విద్యార్థి మృతి!
- గుజరాత్ రాష్ట్రం పటాన్లోని ధర్పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్
- సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి
- 15 మంది సీనియర్ విద్యార్థులు సస్పెండ్
- కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ రాష్ట్రం పటాన్లోని ధర్పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత, కళాశాల అడ్మినిస్ట్రేషన్ 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయమై ధర్పూర్ మెడికల్ కాలేజీ అదనపు డీన్ పటాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 1న అనిల్ మెథానియా మరణించారని, ఆ తర్వాత కాలేజీ డీన్ హార్దిక్ షా ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిటీ విచారణ ప్రారంభించింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. మొదటి సంవత్సరం విద్యార్థులను సీనియర్ విద్యార్థులు రాత్రి 8:30 గంటలకు పరిచయం చేసుకునేందుకు పిలిచారు. జూనియర్ విద్యార్థులు వెళ్లారు. అందులో చనిపోయిన విద్యార్థి అనిల్ కూడా ఉన్నాడు. ఈ సమయంలో సీనియర్లు జూనియర్లపై ర్యాగింగ్ ప్రారంభించారు. సినిమా పాటలు పాడుతూ.. డ్యాన్ చేయాలని అనిల్ ని సీనియర్లు పోర్స్ చేశారు. అతనిని దుర్భాషలాడాడు, మూడు గంటల పాటు అలాగే నిలబెట్టారు. అనిల్ ఆరోగ్యం క్షీణించడంతో తల తిరగడంతో కింద పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
15 మంది సీనియర్ విద్యార్థులు సస్పెండ్..
ఈ ఘటనపై కళాశాల కమిటీ ఇతర సీనియర్ విద్యార్థులను కూడా విచారించింది. వారు మొదటి సంవత్సరం విద్యార్థులు చెప్పిన విషయాన్ని సమర్థించారు. నిజంగానే ర్యాగింగ్ జరిగిందని తెలిపారు. దీని తర్వాత కమిటీ 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పటాన్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 105, 127(2), 189(2), 190, 296(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎస్పీ కేకే పాండ్య తెలిపారు. ఈ కేసును పూర్తిగా నిష్పక్షపాతంగా విచారించేందుకు వీలుగా సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేశామని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ర్యాగింగ్ను యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారించి కఠిన చర్యలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!