CM Revanth: 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి.. వారి సంప్రదాయాలు, విశ్వాసాల మేరకే ఆలయ నిర్మాణం!
- 100 రోజుల్లో మేడారం ఆలయ అభివృద్ధి
- ఆదివాసీ సంప్రదాయాలకు గౌరవం ఇస్తామని హామీ
- భక్తి, సంప్రదాయాలకు మించినది ఏదీ లేదు
- మేడారం ఆలయ పనులు వేగవంతం
- ఆలయ అభివృద్ధి అంటే డబ్బులు కాదు, భక్తి : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth: మేడారంలో శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ఆలయ అభివృద్ధి, విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లను అధికారులు పూజారులకు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం, వారి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.
మేడారంలో ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసీల సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి సంప్రదాయాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని.. వారి సంప్రదాయంలో ఏమాత్రం మార్పు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
- IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
- Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
Hong Kong Sixes 2025: టీమిండియా కెప్టెన్గా దినేష్ కార్తీక్.. అలా ఎలా అంటే?
ఆలయ అభివృద్ధిని డబ్బులతో కాకుండా భక్తితో చూడాలని, ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా పనులు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పనులు వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని, పనులను పూర్తి చేసే బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. అలాగే నిర్మాణాలు రాతి కట్టడాలతో ఉండేలా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జంపన్న వాగులో నీరు నిల్వ ఉండేలా చెక్డ్యామ్లు నిర్మించాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
Supreme Court: ప్రజా ధనాన్ని విగ్రహాలకు ఎలా ఖర్చు చేస్తారు? డీఎంకే ప్రభుత్వానికి చీవాట్లు
ఇంకా ఆలయ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటున్నానని ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డ నుంచే పాదయాత్ర మొదలుపెట్టానని, అమ్మవార్ల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆదివాసీల పోరాటానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని కొనియాడారు. చివరగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పూజారులను సత్కరించారు. అలాగే ఆయన నిలువెత్తు బంగారాన్ని (68 కేజీల బెల్లం) అమ్మవారికి సమర్పించారు.
తాజావార్తలు
-
MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
-
IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
-
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
-
CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
-
Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!