Crime News: లవర్ మోజులో పడి.. కన్న కూతురునే కడతేర్చిన కసాయితల్లి!
- మమతకు భాస్కర్తో ఐదేళ్ల క్రితం పెళ్లి
- వారికి కొడుకు చరణ్, కూతురు తనుశ్రీ
- శభాష్పల్లికి చెందిన ఫయాజ్తో పరిచయం
- మార్చిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఫయాజ్, మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడిని, కన్న పిల్లలను కూడా కాదనుకుంటున్నారు కొంత మంది మహిళలు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య సంచలనం కలిగిస్తున్నాయి. అంతే కాదు.. ప్రియుడి కోసం కట్టుకున్న వాడినో లేదా కన్న పిల్లలనో చంపేస్తున్నారు. చివరికి పోలీసు కేసులతో కటకటాలపాలవుతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో లవర్ మోజులో పడి కూతురును కడతేర్చింది ఓ కసాయి తల్లి.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లికి చెందిన బంటు మమత.. తన రెండేళ్ల కూతురిని తీసుకొని ప్రియుడితో కలిసి ఏపీకి పారిపోయింది. అక్కడ కూతురిని హత్య చేసిన అనంతరం డెడ్బాడీని బైక్పై స్వగ్రామానికి తీసుకొచ్చి పూడ్చివేసి తిరిగి వెళ్లిపోయింది. చివరకు పోలీసులు ఇద్దరినీ పట్టుకోవడంతో చిన్నారి హత్య విషయం బయటపడింది.
Also Read
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
శభాష్పల్లికి చెందిన బంటు మమతకు రాయపోల్ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి కొడుకు చరణ్, కూతురు తనుశ్రీ ఉన్నారు. మమతకు ఏడాది కిందట శభాష్పల్లికి చెందిన ఫయాజ్తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఫయాజ్, మమత గత మార్చిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఐతే భర్త భాస్కర్ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన రాయపోల్ పోలీసులు.. ఇద్దరిని హైదరాబాద్లో పట్టుకున్నారు. తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. పెద్దల సమక్షంలో మమతకు నచ్చజెప్పి తిరిగి అత్తారింటికి పంపించారు.
అంతా బాగుంటుంది అనుకున్న సమయంలో మే 21న శభాష్పల్లిలో ఉన్న మమత.. తన కూతురు తనుశ్రీని తీసుకొని మరోసారి ఫయాజ్తో వెళ్లిపోయింది. మమత తండ్రి ఫిర్యాదుతో శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారు ఏపీలోని నర్సరావుపేటలో ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ ఇద్దరినీ శివ్వంపేటకు తీసుకొచ్చి చిన్నారి గురించి అడిగారు. ఆ సమయంలో చిన్నారిని హత్య చేసిన విషయం బయటపడింది.
జూన్ 7న తనుశ్రీని గొంతు నులిమి చంపేసినట్లు మమత ఒప్పుకుంది. అంతే కాదు.. బైక్పై నరసరావుపేట నుంచి శభాష్పల్లికి తీసుకొచ్చి గ్రామ శివారులోని కాల్వ పక్కన పూడ్చివేసి తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారంతో కాల్వ పక్కన తవ్వి చిన్నారి డెడ్బాడీని బయటకు తీశారు పోలీసులు. అక్కడే పోస్ట్మార్టం చేయించి చిన్నారి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారిని అత్యంత దారుణంగా చంపేసిన తమ కూతురు మమతను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ కేసులో ప్రియుడు ఫయాజ్తోపాటు మమతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!