Indians Return: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ యుద్ధ వాతావరణంలో ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఒకరు గల్లంతయ్యారని అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్ మహాజన్ వెల్లడించారు. ఒమన్ లోని సోహర్ నగరంలో మరణించిన ఇద్దరు భారతీయుల భౌతిక కాయాలను ఇప్పటికే జైపూర్ లోని వారి కుటుంబాలకు చేరవేసినట్లు ఆయన తెలిపారు.
India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్లో కొత్త రూల్స్..
ఇరాన్ నుండి అర్మేనియా, అజర్ బైజాన్ మీదుగా సుమారు 700 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో 284 మంది యాత్రికులు ఉండగా, వారిలో 130 మంది ఈరోజు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు దాదాపు 2.44 లక్షల మంది భారతీయులు ఈ ప్రాంతం నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు.
Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. ఏడుగురు మృతి.!
కువైట్ వైమానిక మార్గం మూసివేసినప్పటికీ.. సౌదీ అరేబియా మీదుగా ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు కొనసాగుతోంది. యూఏఈ, ఒమన్, ఖతార్ నుండి పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. మరోవైపు, ఈ సమస్యపై బ్రిక్స్ (BRICS) దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం సవాలుగా మారిందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ సంక్షోభం ఇంధన భద్రతపై ప్రభావం చూపుతుందని.. చర్చలు, దౌత్యం ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలని భారత్ ఐరోపా సమాఖ్య (EU) వేదికగా స్పష్టం చేసింది. భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
