బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. బీజేపీపై వివాదాస్పద కామెంట్స్ చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి పరిపక్వత సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు.
Read Also: SRH vs LSG: సన్రైజర్స్, లక్నో మ్యాచ్పై నీలి నీడలు.. ఆందోళనలో హైదరాబాద్ ఫాన్స్!
కాగా, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపుగా కాన్షీరామ్, నేను జీవితం మొత్తాన్ని దాని కోసమే అంకితం చేశామని మాయావతి చెప్పుకొచ్చారు. అందుకే కొత్తతరాన్ని కూడా సిద్ధం చేస్తున్నాం.. ఈ క్రమంలో పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాశ్ ఆనంద్ను జాతీయ సమన్వయకర్తగా ప్రకటించాం.. కానీ, పార్టీ, ఉద్యమ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఆకాష్ పూర్తి స్థాయిలో పరిపక్వత సాధించే వరకు ఆయన్ని కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్ కుమార్ పార్టీలో కీలక బాధ్యతలను నిర్వర్తించబోతున్నారని మాయావతి వెల్లడించారు.
Read Also: Lok Sabha Elections 2024 : పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అగ్ని ప్రమాదం.. ఎక్కడంటే..?
అయితే, ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్గా పేర్కొన్నారు. యువతను ఆకలితో ఉంచుతూ.. పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో ఆకాశ్తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. ఈ పరిణామం తర్వాత ఆయన ర్యాలీలన్నింటినీ బీఎస్పీ క్యాన్సిల్ చేయడంతో పాటు ఆకాశ్ ఆనంద్ కు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా బీఎస్పీ తొలగించింది.