Mayank Agarwal: హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న ఐపీఎల్ అన్సోల్డ్ ప్లేయర్
- హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న
- కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్
- విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayank Agarwal: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాను మూడు వరుస మ్యాచ్ల్లో మూడు సెంచరీలు సాధించి సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకునే క్రమంలో చాలా కష్టపడుతున్న ఈ ఆటగాడు, ఈ ట్రోఫీలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్తో జరిగిన రౌండ్ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ 104 బంతుల్లో 124 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన మయాంక్ ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించాడు. దానితో కర్ణాటక జట్టు ఈ మ్యాచ్లో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.
Also Read: Healthy Resolution: కొత్త ఏడాదిలో ఆరోగ్యం కోసం ఈ రిజల్యూషన్ తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ఈ సెంచరీకి ముందు అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ జట్లతో జరిగిన మ్యాచ్ల్లోనూ మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 45 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేయగా, పంజాబ్తో మ్యాచ్లో 127 బంతుల్లో అజేయంగా 139 పరుగులు సాధించాడు. టోర్నమెంట్ తొలి మ్యాచ్లోనూ 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన మయాంక్, కర్ణాటక జట్టు కోసం మ్యాచ్ విన్నర్గా నిరూపించుకుంటున్నాడు. ఇన్ని పరుగులు చేస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో మయాంక్ అగర్వాల్ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగంగా ఉన్నప్పటికీ, కేవలం 4 మ్యాచ్లు ఆడే అవకాశం మాత్రమే లభించింది. ఆ తర్వాత అతడిని విడుదల చేయాలని హైదరాబాద్ జట్టు నిర్ణయించింది. ఈసారి మెగా వేలంలో కోటి రూపాయల బేస్ ధరతో పాల్గొన్నప్పటికీ, మయాంక్ను ఏ జట్టు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో తనను ఏ జట్టు కొనుగోలు చేయనప్పటికీ, మయాంక్ అగర్వాల్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో తన అద్భుత బ్యాటింగ్తో జట్టుకు విజయాలు అందిస్తూ దక్కని గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. ఈ ఫామ్ కొనసాగిస్తే మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించే అవకాశం కల్పించుకోవచ్చని ఆశిస్తున్నాడు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!