Mayank Agarwal: హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న ఐపీఎల్ అన్సోల్డ్ ప్లేయర్
- హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న
- కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్
- విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayank Agarwal: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాను మూడు వరుస మ్యాచ్ల్లో మూడు సెంచరీలు సాధించి సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకునే క్రమంలో చాలా కష్టపడుతున్న ఈ ఆటగాడు, ఈ ట్రోఫీలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్తో జరిగిన రౌండ్ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ 104 బంతుల్లో 124 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన మయాంక్ ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించాడు. దానితో కర్ణాటక జట్టు ఈ మ్యాచ్లో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.
Also Read: Healthy Resolution: కొత్త ఏడాదిలో ఆరోగ్యం కోసం ఈ రిజల్యూషన్ తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి
Also Read
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ఈ సెంచరీకి ముందు అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ జట్లతో జరిగిన మ్యాచ్ల్లోనూ మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 45 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేయగా, పంజాబ్తో మ్యాచ్లో 127 బంతుల్లో అజేయంగా 139 పరుగులు సాధించాడు. టోర్నమెంట్ తొలి మ్యాచ్లోనూ 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన మయాంక్, కర్ణాటక జట్టు కోసం మ్యాచ్ విన్నర్గా నిరూపించుకుంటున్నాడు. ఇన్ని పరుగులు చేస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో మయాంక్ అగర్వాల్ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగంగా ఉన్నప్పటికీ, కేవలం 4 మ్యాచ్లు ఆడే అవకాశం మాత్రమే లభించింది. ఆ తర్వాత అతడిని విడుదల చేయాలని హైదరాబాద్ జట్టు నిర్ణయించింది. ఈసారి మెగా వేలంలో కోటి రూపాయల బేస్ ధరతో పాల్గొన్నప్పటికీ, మయాంక్ను ఏ జట్టు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో తనను ఏ జట్టు కొనుగోలు చేయనప్పటికీ, మయాంక్ అగర్వాల్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో తన అద్భుత బ్యాటింగ్తో జట్టుకు విజయాలు అందిస్తూ దక్కని గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. ఈ ఫామ్ కొనసాగిస్తే మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించే అవకాశం కల్పించుకోవచ్చని ఆశిస్తున్నాడు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!