Mayank Agarwal: హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న ఐపీఎల్ అన్సోల్డ్ ప్లేయర్
- హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న
- కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్
- విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayank Agarwal: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాను మూడు వరుస మ్యాచ్ల్లో మూడు సెంచరీలు సాధించి సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకునే క్రమంలో చాలా కష్టపడుతున్న ఈ ఆటగాడు, ఈ ట్రోఫీలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్తో జరిగిన రౌండ్ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ 104 బంతుల్లో 124 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన మయాంక్ ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించాడు. దానితో కర్ణాటక జట్టు ఈ మ్యాచ్లో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.
Also Read: Healthy Resolution: కొత్త ఏడాదిలో ఆరోగ్యం కోసం ఈ రిజల్యూషన్ తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
ఈ సెంచరీకి ముందు అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ జట్లతో జరిగిన మ్యాచ్ల్లోనూ మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 45 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేయగా, పంజాబ్తో మ్యాచ్లో 127 బంతుల్లో అజేయంగా 139 పరుగులు సాధించాడు. టోర్నమెంట్ తొలి మ్యాచ్లోనూ 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన మయాంక్, కర్ణాటక జట్టు కోసం మ్యాచ్ విన్నర్గా నిరూపించుకుంటున్నాడు. ఇన్ని పరుగులు చేస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో మయాంక్ అగర్వాల్ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగంగా ఉన్నప్పటికీ, కేవలం 4 మ్యాచ్లు ఆడే అవకాశం మాత్రమే లభించింది. ఆ తర్వాత అతడిని విడుదల చేయాలని హైదరాబాద్ జట్టు నిర్ణయించింది. ఈసారి మెగా వేలంలో కోటి రూపాయల బేస్ ధరతో పాల్గొన్నప్పటికీ, మయాంక్ను ఏ జట్టు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో తనను ఏ జట్టు కొనుగోలు చేయనప్పటికీ, మయాంక్ అగర్వాల్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో తన అద్భుత బ్యాటింగ్తో జట్టుకు విజయాలు అందిస్తూ దక్కని గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. ఈ ఫామ్ కొనసాగిస్తే మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించే అవకాశం కల్పించుకోవచ్చని ఆశిస్తున్నాడు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?