MS DHONI: మీకు పరేషాన్ వొద్దు.. మీవోడు ఇప్పటి నుంచి నా మనిషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో కీలక పాత్ర వహిస్తున్న డెత్ స్పెషలిస్టుగా ఎదుగుతున్న యువ సంచలనం మతీశ పతిరాన.. తన ఫ్యామిలీతో కలిసి చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనిని కలిశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండో సీజన్ ఆడుతున్న పతిరాన.. ఈ ఏడాది సీఎస్కేకి మెయిన్ బౌలర్ గా మారాడు. అయితే 20 ఏళ్ల కుమారుడిపై బెంగ పెట్టుకుని చెన్నైకి వచ్చిన పతిరాన తల్లిదండ్రులకు.. అతడి కుటుంబానికి ధోని ధైర్యం చెప్పాడు. పతిరాన తన సొంత మనిషి అని.. అతడి భవిష్యత్ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధోని వారికి హామీ ఇచ్చాడు.
Also Read : YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులెటిన్ విడుదల.. మెరుగైన వైద్యం కోసం..
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఈ మేరకు పతిరాన సోదరి ( విషుక పతిరాన ) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ ఫోటోలను పంచుకుని ధోని తమకు హామీ ఇచ్చిన విషయాన్ని వెల్లడించింది. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో ధోనిని కలిసిన పతిరాన కుటుంబానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. మా మల్లి (పతిరాన ముద్దుపేరు) సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడని రాసుకొచ్చింది. మా మల్లి ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడు.. మీరు పతిరాన గురించి దిగులు చెందాల్సిన పన్లేదు.. అతడెప్పుడూ నాతోనే ఉంటాడు అని తాలా మాకు చెప్పాడు అని వెల్లడించింది. ధోనిని కలిసిన క్షణాలు నేను కలగన్నదానికంటే మించి ఉన్నాయి అని ఆమె ఇన్ స్టా పోస్ట్ లో తెలిపింది.
Also Read : Dimple Hayati: డింపుల్ ఇంట్లోకి అపరిచుతులు… లిఫ్ట్ వరకూ తరిమిన కుక్క
కాగా.. ఈ సీజన్ లో పతిరానను ధోని బాగా ప్రోత్సహిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచిన ప్రతీసారి ధోని.. పతిరానపై ప్రశంసలు కురిపించాడు. అతడు ఇప్పుడప్పడే టెస్టులకు రాకూడదని.. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఆడాలని తెలిపాడు. ఇక ఐపీఎల్16 లో పతిరాన.. 11 మ్యాచ్ లలో 42.2 ఓవర్లు బౌలింగ్ వేసి 17 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే చెన్నై-గుజరాత్ మధ్య జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ లో పతిరాన నాలుగు ఓవర్లు వేసి 37 పరుగులిచ్చినా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక గుజరాత్ పై గెలిచిన సీఎస్కే.. నేడు ముంబై-గుజరాత్ మధ్య జరుగబోయే క్వాలిఫయర్ -2లో విజేతతో మే 28 ( ఆదివారం )న ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!